PRINT TIME: April 21, 2026 11:00 PM
బోల్తా పడిన ఆర్టీసీ బస్సు. 30 మంది ప్రయాణికులు సురక్షితం
బోల్తా పడిన ఆర్టీసీ బస్సు. 30 మంది ప్రయాణికులు సురక్షితం
April 21, 2026 09:01 PM
96 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
శ్రీశైలం ఘాట్రోడ్డులో ఆర్టీసీ బస్సు బోల్తా పడిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. దోర్నాల మండలం చిన్నారుట్ల–తుమ్మలబైలు సమీపంలోని మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది.
శ్రీశైలం నుంచి మార్కాపురం వెళ్తున్న బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. మలుపు వద్ద డ్రైవర్ వేగాన్ని నియంత్రించలేకపోవడంతో బస్సు అదుపుతప్పి బోల్తా పడినట్లు సమాచారం.
అయితే, ఈ ఘటనలో ఎవరికీ ప్రాణాపాయం లేకపోవడం ఊరటనిచ్చింది. ప్రయాణికులందరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి