Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 03:42 AM

బోగారంలో చేనేత మగ్గం వద్దకు వెళ్లిన హైకోర్టు న్యాయమూర్తులు

బోగారంలో చేనేత మగ్గం వద్దకు వెళ్లిన హైకోర్టు న్యాయమూర్తులు

బోగారంలో చేనేత మగ్గం వద్దకు వెళ్లిన హైకోర్టు న్యాయమూర్తులు
February 01, 2026 08:32 PM 227 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మగ్గం నేసి చేనేతల నైపుణ్యాన్ని ప్రశంసించిన పి. శ్యామ్ కోషి

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలో నూతన కోర్టు భవనాల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ కార్యనిర్వాహక అధ్యక్షుడు పి. శ్యామ్ కోషి తో పాటు పలువురు ఉన్నత న్యాయమూర్తులు హాజరయ్యారు.శంకుస్థాపన అనంతరం రామన్నపేట మండలం బోగారం గ్రామాన్ని సందర్శించిన న్యాయమూర్తులు అక్కడి చేనేత మగ్గం నేతలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా పి. శ్యామ్ కోషి స్వయంగా మగ్గం నేసి చేనేత కార్మికుల శ్రమను ప్రత్యక్షంగా అనుభవించారు. తరతరాలుగా కొనసాగుతున్న చేనేత వృత్తి గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కీలకమని పేర్కొంటూ చేనేతల కళా నైపుణ్యాన్ని ప్రశంసించారు.ఈ సందర్భంగా చేనేత వృత్తిని పరిరక్షించాల్సిన అవసరం ఉందని, సంప్రదాయ వృత్తులు నిలబెట్టుకోవాలంటే ప్రభుత్వాలు, సమాజం కలిసి ముందుకు రావాల్సిన అవసరం ఉందని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తులు కె. శరత్, కె. లక్ష్మణ్, బి. విజయసేన రెడ్డి, వాకిటి రామకృష్ణారెడ్డి, కె. సుజన, నర్సింగరావు నందికొండ పాల్గొన్నారు. అలాగే రామన్నపేట న్యాయమూర్తులు, యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ. జయరాజు హాజరయ్యారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News