భోపాల్ వేదికగా మెరిసిన రామన్నపేట ప్రతిభ – డాక్టర్ కృష్ణ కౌండిన్యకు ‘సాహిత్యశ్రీ’ పురస్కారం
భోపాల్ వేదికగా మెరిసిన రామన్నపేట ప్రతిభ – డాక్టర్ కృష్ణ కౌండిన్యకు ‘సాహిత్యశ్రీ’ పురస్కారం
స్థానికం బృందం
రామన్నపేటకు చెందిన ప్రముఖ కవి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ తండు కృష్ణ కౌండిన్యకు ప్రతిష్టాత్మక ‘సాహిత్యశ్రీ’ పురస్కారం లభించింది. అఖిల భారతీయ భాషా సాహిత్య సమ్మేళన్ ఆధ్వర్యంలో భోపాల్ లో నిర్వహించిన జాతీయ సాహిత్య కార్యక్రమంలో ఈ అవార్డును ఘనంగా ప్రదానం చేశారు.
డాక్టర్ కృష్ణ కౌండిన్య గారి విశిష్ట సాహిత్య సేవలను గుర్తిస్తూ, ఆ సంస్థ జాతీయ అధ్యక్షులు డాక్టర్ వీరేంద్ర సింగ్ చేతుల మీదుగా ‘సాహిత్యశ్రీ’ పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భం సభలో చప్పట్లతో మార్మోగింది.
కార్యక్రమానికి హాజరైన డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య, కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖానం, అధ్యాపకులు, కార్యాలయ సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా సాహితీ మిత్ర మండలి ప్రధాన కార్యదర్శి బాసరాజు యాదగిరి, సృజన సాహితీ సంస్థ అధ్యక్ష కార్యదర్శులు పెరుమాళ్ళ ఆనంద్, డాక్టర్ సాగర్ల సత్తయ్యతో పాటు పలువురు కవులు, రచయితలు డాక్టర్ కౌండిన్యను అభినందించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి