భువనగిరి స్థానికం ప్రధాన ప్రతినిధి
భోగి, మకర సంక్రాంతి పండుగలను పురస్కరించుకుని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు జిల్లా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ…
భోగభాగ్యాలతో, సిరిసంపదలతో జిల్లా ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ భోగి–సంక్రాంతి జిల్లా ప్రజల జీవితాల్లో నూతన కాంతులు నింపాలని, ఆనందోత్సాహాలతో పండుగను ఘనంగా జరుపుకోవాలని కోరారు.పండుగ వేళ ప్రజలంతా ఐక్యతతో ముందుకు సాగాలని, ప్రతి కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. భోగి–సంక్రాంతి సందర్భంగా జిల్లా ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, ప్రజలందరికీ కలెక్టర్ శుభాకాంక్షలు తెలియజేశారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి