భీమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలకు పోటెత్తిన జనసందోహం
భీమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలకు పోటెత్తిన జనసందోహం
స్థానికం బృందం
అభిమానుల కోలాహలం… ఏదులాపురం ఉత్సవంగా మారింది
ఒకే వేదికపై మంత్రి గారి నమ్మకస్తులు… కార్యకర్తల్లో ఉత్సాహం
ఏదులాపురం గ్రామం శనివారం రాజకీయ సందడితో దద్దరిల్లింది. రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విశ్వాసపాత్రుడు, కూసుమంచి నియోజకవర్గ క్యాంప్ కార్యాలయ ఇన్చార్జ్ భీమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు పండుగను తలపించాయి. సాయి గణేష్ నగర్లో జరిగిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు భారీగా తరలిరావడంతో పరిసర ప్రాంతాలు జనసముద్రంగా మారాయి.మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం క్యాంప్ కార్యాలయ ఇన్చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వేడుకలకు మరింత వన్నె తీసుకొచ్చారు. మంత్రి కి రెండు కళ్లలా వ్యవహరిస్తూ నియోజకవర్గ బాధ్యతలను భుజాన వేసుకున్న దయాకర్ రెడ్డి, భీమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిలు ఒకే వేదికపై కనిపించడంతో కార్యకర్తల్లో కొత్త జోష్ వెల్లివిరిసింది.దయాకర్ రెడ్డి చేతుల మీదుగా శ్రీనివాస్ రెడ్డి కేక్ కట్ చేయగా, ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు కేరింతలతో వేదికను మార్మోగించారు.ఈ కార్యక్రమం కేవలం జన్మదిన వేడుకగానే కాకుండా కాంగ్రెస్ శ్రేణుల బలాన్ని ప్రతిబింబించే ఆత్మీయ సమ్మేళనంగా మారింది. “పొంగులేటి ఆశయమే మన మార్గం – ప్రజల సేవయే మన లక్ష్యం” అంటూ నినాదాలు మార్మోగాయి. భారీ కేకులు, పుష్పమాలలతో అభిమానులు తమ నాయకుడిపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.ఎటు చూసినా కాంగ్రెస్ జెండాలు, కార్యకర్తల కేరింతలే కనిపించాయి. సాయి గణేష్ నగర్ ప్రాంతమంతా హస్తం శ్రేణుల ఉత్సాహంతో నిండిపోయింది.ఈ వేడుకలు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలాన్ని, నాయకత్వంపై కార్యకర్తలకు ఉన్న విశ్వాసాన్ని మరోసారి స్పష్టంగా చూపించాయని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి