Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 07:44 PM

బీసీ సింహ గర్జన పోస్టర్ ఆవిష్కరణ

బీసీ సింహ గర్జన పోస్టర్ ఆవిష్కరణ

బీసీ సింహ గర్జన పోస్టర్ ఆవిష్కరణ
February 18, 2026 07:46 PM 71 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

అమరావతిలో ఈ నెల 22న మహాసభ – బీసీల ఐక్యతే లక్ష్యం

తెలుగు రాష్ట్రాల్లో బీసీల ఐక్యత, ఆత్మగౌరవం, అధికారమే ధ్యేయంగా భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 22న అమరావతిలో బీసీ సింహ గర్జన నిర్వహించనున్నట్లు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు బొడ్డు వెంకన్న యాదవ్ ప్రకటించారు. నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట ఉన్న పూలే–అంబేద్కర్–మండల్–కర్పూరి ప్రాంగణంలో ఈ మహాసభ జరగనుంది. ఈ సభకు సంబంధించిన పోస్టర్లను స్థానిక జ్యోతిరావు ఫూలే భవన్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ మార్గదర్శకత్వంలో సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 79 సంవత్సరాలు అయినా బీసీలు సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని అన్నారు. బీసీలు సామాజిక వివక్షకు గురవుతున్నారని, వారిపై దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. బీసీ కులాల కార్పొరేషన్లకు తగిన నిధులు కేటాయించి అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించాలని కోరారు. విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థలు, చట్టసభల్లో 44 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. రాజధాని ప్రాంతంలో బీసీ కులాలకు వెయ్యి ఎకరాలు కేటాయించాలని కూడా కోరారు.

బీసీ సింహ గర్జన సభను లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మురళి, సామాజికవేత్త డాక్టర్ రాజు, రాపోలు సత్యనారాయణ, కొండా రాంబాబు, సురేష్ యాదవ్, బీసీ సంక్షేమ సంఘం నాయకుడు బోయపల్లి రవీంద్ర గౌడ్, అనిల్ కుమార్ గౌడ్, దాసరాజు జయరాజ్ ముదిరాజ్, విద్యార్థి నాయకులు వేణుమాధవ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News