Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నియోజకవర్గ సాధనకు ఐక్యంగా ముందుకు రావాలి – సర్పంచ్‌ల సన్మానం సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 02:44 PM

బీసీ సింహ గర్జన పోస్టర్ ఆవిష్కరణ

బీసీ సింహ గర్జన పోస్టర్ ఆవిష్కరణ

బీసీ సింహ గర్జన పోస్టర్ ఆవిష్కరణ
February 18, 2026 07:46 PM 67 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

అమరావతిలో ఈ నెల 22న మహాసభ – బీసీల ఐక్యతే లక్ష్యం

తెలుగు రాష్ట్రాల్లో బీసీల ఐక్యత, ఆత్మగౌరవం, అధికారమే ధ్యేయంగా భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 22న అమరావతిలో బీసీ సింహ గర్జన నిర్వహించనున్నట్లు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు బొడ్డు వెంకన్న యాదవ్ ప్రకటించారు. నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట ఉన్న పూలే–అంబేద్కర్–మండల్–కర్పూరి ప్రాంగణంలో ఈ మహాసభ జరగనుంది. ఈ సభకు సంబంధించిన పోస్టర్లను స్థానిక జ్యోతిరావు ఫూలే భవన్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ మార్గదర్శకత్వంలో సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 79 సంవత్సరాలు అయినా బీసీలు సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని అన్నారు. బీసీలు సామాజిక వివక్షకు గురవుతున్నారని, వారిపై దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. బీసీ కులాల కార్పొరేషన్లకు తగిన నిధులు కేటాయించి అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించాలని కోరారు. విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థలు, చట్టసభల్లో 44 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. రాజధాని ప్రాంతంలో బీసీ కులాలకు వెయ్యి ఎకరాలు కేటాయించాలని కూడా కోరారు.

బీసీ సింహ గర్జన సభను లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మురళి, సామాజికవేత్త డాక్టర్ రాజు, రాపోలు సత్యనారాయణ, కొండా రాంబాబు, సురేష్ యాదవ్, బీసీ సంక్షేమ సంఘం నాయకుడు బోయపల్లి రవీంద్ర గౌడ్, అనిల్ కుమార్ గౌడ్, దాసరాజు జయరాజ్ ముదిరాజ్, విద్యార్థి నాయకులు వేణుమాధవ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News