బ్రహ్మోత్సవాలకు మైక్ సెట్ దాత కూనూరి సాయికుమార్ గౌడ్కు ఆహ్వాన పత్రిక
బ్రహ్మోత్సవాలకు మైక్ సెట్ దాత కూనూరి సాయికుమార్ గౌడ్కు ఆహ్వాన పత్రిక
స్థానికం బృందం
రామన్నపేట, నిదానపల్లి యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామంలో శివరాత్రి పురస్కరించుకుని నిర్వహించనున్న శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మల్లన్న గుట్టపై నిర్వహించే ఉత్సవాలకు మైక్ సెట్ ఏర్పాటు చేసి సహకారం అందించిన బోగారం సర్పంచ్ కూనూరి సాయికుమార్ గౌడ్కు ఉత్సవ కమిటీ ప్రత్యేకంగా ఆహ్వాన పత్రిక అందజేసింది.గురువారం ఉత్సవ కమిటీ చైర్మన్ చల్ల నరసింహ ఆధ్వర్యంలో ఆహ్వాన పత్రిక అందజేస్తూ, బ్రహ్మోత్సవాలను భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేస్తున్నట్లు తెలిపారు. గ్రామస్థులు, పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి దర్శనం చేసుకుని పుణ్యఫలాలు పొందాలని కోరారు.ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగే ఈ బ్రహ్మోత్సవాలకు గ్రామ ప్రజల సహకారం విశేషంగా ఉందని కమిటీ సభ్యులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఆగు చిన్న లింగస్వామి, నాయకులు కొండ మల్లయ్య, కూనూరి రాజు, బైకాని మహేష్ తదితరులు పాల్గొన్నారు.వనగిరి

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి