Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:35 PM

బాలుడి హత్య కేసులో ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష

బాలుడి హత్య కేసులో ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష

బాలుడి హత్య కేసులో ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష
March 13, 2026 10:15 AM 77 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ముగ్గురికి జరిమానా విధించిన జిల్లా కోర్టు

అనంతపురం: జిల్లాలో సంచలనం సృష్టించిన బాలుడి హత్య కేసులో ముగ్గురికి జిల్లా కోర్టు యావజ్జీవ కఠిన కారాగార శిక్ష విధించింది. అలాగే ముగ్గురికి జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది.

అనంతపురం జిల్లా శెట్టూరు పోలీస్ స్టేషన్‌లో 2022లో నమోదైన క్రైమ్ నెంబర్.70/2022 కేసులో తిప్పనపల్లి గ్రామానికి చెందిన గొల్ల చిత్తప్ప, గొల్ల ఈరన్న, మురుకుందప్పలను దోషులుగా తేల్చిన జిల్లా జడ్జి ఈ.భీమారావు జీవిత ఖైదు శిక్ష విధించారు.

కేసు వివరాలు

శెట్టూరు మండలం తిప్పనపల్లి గ్రామానికి చెందిన సన్న ఈరన్న, చిత్తప్పలు అన్నదమ్ములు. వీరి మధ్య భూ తగాదాలు ఉన్నాయి. 2022 ఏప్రిల్ 6న మధ్యాహ్నం సుమారు 2.30 గంటల సమయంలో సన్న ఈరన్న కుమారుడు విష్ణువర్ధన్ (11) తన చిన్నాన్న చిత్తప్ప తోటలోకి నీళ్లు తాగేందుకు వెళ్లాడు. అక్కడ మామిడిపండు, వేరుశనగ కాయలు తీసుకున్నాడని ప్రశ్నించగా “ఈ తోటలో నాకు కూడా హక్కు ఉంది” అని బాలుడు చెప్పడంతో చిత్తప్ప ఆగ్రహానికి గురయ్యాడు.

ఈ క్రమంలో చిత్తప్పతో పాటు బాలుడి తాత గొల్ల ఈరన్న, మామ మురుకుందప్ప కలిసి బాలుడిపై దాడి చేసి తాడుతో మెడ బిగించి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని టార్పాలిన్‌లో చుట్టి గడ్డివాములో దాచిపెట్టారు.

బాలుడి తండ్రి సన్న ఈరన్న ఫిర్యాదు మేరకు శెట్టూరు పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి ఎస్సై యువరాజు కేసు నమోదు చేయగా, కళ్యాణదుర్గం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కె.శ్రీనివాసులు దర్యాప్తు చేసి కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు.

కోర్టు విధించిన శిక్షలు

విచారణ అనంతరం కోర్టు ముగ్గురిని దోషులుగా తేల్చి యావజ్జీవ కఠిన కారాగార శిక్ష విధించింది. అలాగే

గొల్ల చిత్తప్పకు రూ.25,000

గొల్ల ఈరన్నకు రూ.50,000

మురుకుందప్పకు రూ.10,000

జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా మూడు నెలల జైలు శిక్ష అనుభవించాలని కోర్టు ఆదేశించింది.

ఈ కేసులో సాక్షులను సకాలంలో కోర్టుకు హాజరు పరచడంలో కీలక పాత్ర పోషించిన జిల్లా కోర్టు మానిటరింగ్ సిస్టమ్ లైజన్ అధికారి ఏఎస్ఐ వై.మారెన్న, జిల్లా కోర్టు ఏఎస్ఐ ఎస్.మల్లిరెడ్డి, కళ్యాణదుర్గం రూరల్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుళ్లు కృష్ణమోహన్, రామమోహన్, కుళ్లాయి స్వామిలను జిల్లా ఎస్పీ పి.జగదీష్ మరియు కళ్యాణదుర్గం డీఎస్పీ అభినందించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News