PRINT TIME: February 23, 2026 06:26 PM
బాల్య మిత్రుడి కుటుంబానికి అండగా స్నేహితులు.
బాల్య మిత్రుడి కుటుంబానికి అండగా స్నేహితులు.
February 23, 2026 04:20 PM
189 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం
రూ.63 వేల డిపాజిట్… పిల్లల భవిష్యత్తుకు భరోసా
రామన్నపేట మండలంలోని శోభానాద్రిపురానికి చెందిన బోడిగే నరేష్ గౌడ్ అకాల మరణం గ్రామంలో విషాదాన్ని నింపింది. ఈ నేపథ్యంలో ఆయన బాల్యమిత్రులు, తోటి విద్యార్థులు మానవతా దృక్పథంతో ముందుకొచ్చారు.
7వ తరగతి, 10వ తరగతి (2005–06 బ్యాచ్), ఇంటర్ బ్యాచ్కు చెందిన స్నేహితులు కలిసి రూ.63 వేల మొత్తాన్ని సేకరించి నరేష్ గౌడ్ పిల్లల పేరుపై డిపాజిట్ చేశారు. పిల్లల విద్యాభ్యాసానికి ఈ నిధి ఉపయోగపడుతుందని తెలిపారు.
కష్టసమయంలో తోడుగా నిలవడమే నిజమైన స్నేహమని పేర్కొంటూ, భవిష్యత్తులో కూడా కుటుంబానికి అవసరమైన సహాయం అందిస్తామని మిత్రులు తెలిపారు. గ్రామస్తులు ఈ చర్యను అభినందిస్తూ, స్నేహబంధం విలువను చాటిన ఉదాహరణగా కొనియాడుతున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి