Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ కట్టే చెల్లి కోసం.. హెల్మెట్‌ ధరించండి: జిల్లా ఎస్పీ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 03:26 AM

బీసీల కోసం భగ్గుమన్న సాయి చారి.. మాట తప్పిన సర్కార్‌పై మంటై ఎగిసిన ప్రాణం!

బీసీల కోసం భగ్గుమన్న సాయి చారి.. మాట తప్పిన సర్కార్‌పై మంటై ఎగిసిన ప్రాణం!

బీసీల కోసం భగ్గుమన్న సాయి చారి.. మాట తప్పిన సర్కార్‌పై మంటై ఎగిసిన ప్రాణం!
06-12-2025 150 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల లొల్లి చిలికి చిలికి గాలివానైంది.. కాదు కాదు, దావానలమైంది! బీసీలకు ఇస్తామన్న 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా సర్కారు మోసం చేసిందంటూ మనస్తాపానికి గురైన సాయి ఈశ్వర్ చారి (సాయి చారి) ఆత్మబలిదానం చేసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది.


"మోసం చేసిన్రు.. నా చావుతోనైనా కళ్లు తెరుస్తారా?" మేడ్చల్ జిల్లా, మేడిపల్లి పరిధిలో.. "మా బీసీలకు న్యాయం చేయాల్సిందే" అంటూ నినదించిన సాయి చారి, ఒంటి మీద పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నడు. "కామారెడ్డి డిక్లరేషన్‌లో చెప్పినట్టు 42 శాతం రిజర్వేషన్లు ఎక్కడికి పోయినయ్? పంచాయతీ ఎలక్షన్లలో మా సీట్లు మాకియ్యకుండా కోత పెడ్తారా?" అని ఆవేదన వ్యక్తం చేస్తూ అగ్నికి ఆహుతయ్యిండు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలిండు.


భగ్గుమన్న బీసీ లోకం: సాయి చారి మరణంతో బీసీ సంఘాలు, విద్యార్థులు రోడ్లమీదకు వచ్చిన్రు. "ఇది ఆత్మహత్య కాదు.. సర్కారు చేసిన హత్యే" అని మండిపడుతున్నారు.


"బీసీ బిడ్డ ప్రాణం పోయింది.. సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలె."


"సాయి చారి కుటుంబానికి 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇయ్యాలె."


"వెంటనే 42% రిజర్వేషన్లు అమలు చేయాలె." అంటూ డిమాండ్లతో రాష్ట్రం దద్దరిల్లుతోంది.


రాజకీయ రచ్చ: ప్రతిపక్షాలు కూడా సర్కారు తీరుపై నిప్పులు చెరుగుతున్నాయి. "ఓట్ల కోసం హామీలిచ్చి, తీరా గద్దెనెక్కాక బీసీల గొంతు కోస్తారా?" అని బీఆర్ఎస్, బీజేపీ నేతలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.


మొత్తానికి, సాయి చారి త్యాగం ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్‌లో పెను సంచలనంగా మారింది. మరి సర్కారు ఎట్లా స్పందిస్తదో చూడాలె!

Sthanikam

బీసీల కోసం భగ్గుమన్న సాయి చారి.. మాట తప్పిన సర్కార్‌పై మంటై ఎగిసిన ప్రాణం!

Article Image

తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల లొల్లి చిలికి చిలికి గాలివానైంది.. కాదు కాదు, దావానలమైంది! బీసీలకు ఇస్తామన్న 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా సర్కారు మోసం చేసిందంటూ మనస్తాపానికి గురైన సాయి ఈశ్వర్ చారి (సాయి చారి) ఆత్మబలిదానం చేసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది.


"మోసం చేసిన్రు.. నా చావుతోనైనా కళ్లు తెరుస్తారా?" మేడ్చల్ జిల్లా, మేడిపల్లి పరిధిలో.. "మా బీసీలకు న్యాయం చేయాల్సిందే" అంటూ నినదించిన సాయి చారి, ఒంటి మీద పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నడు. "కామారెడ్డి డిక్లరేషన్‌లో చెప్పినట్టు 42 శాతం రిజర్వేషన్లు ఎక్కడికి పోయినయ్? పంచాయతీ ఎలక్షన్లలో మా సీట్లు మాకియ్యకుండా కోత పెడ్తారా?" అని ఆవేదన వ్యక్తం చేస్తూ అగ్నికి ఆహుతయ్యిండు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలిండు.


భగ్గుమన్న బీసీ లోకం: సాయి చారి మరణంతో బీసీ సంఘాలు, విద్యార్థులు రోడ్లమీదకు వచ్చిన్రు. "ఇది ఆత్మహత్య కాదు.. సర్కారు చేసిన హత్యే" అని మండిపడుతున్నారు.


"బీసీ బిడ్డ ప్రాణం పోయింది.. సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలె."


"సాయి చారి కుటుంబానికి 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇయ్యాలె."


"వెంటనే 42% రిజర్వేషన్లు అమలు చేయాలె." అంటూ డిమాండ్లతో రాష్ట్రం దద్దరిల్లుతోంది.


రాజకీయ రచ్చ: ప్రతిపక్షాలు కూడా సర్కారు తీరుపై నిప్పులు చెరుగుతున్నాయి. "ఓట్ల కోసం హామీలిచ్చి, తీరా గద్దెనెక్కాక బీసీల గొంతు కోస్తారా?" అని బీఆర్ఎస్, బీజేపీ నేతలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.


మొత్తానికి, సాయి చారి త్యాగం ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్‌లో పెను సంచలనంగా మారింది. మరి సర్కారు ఎట్లా స్పందిస్తదో చూడాలె!

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News