Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధలో ఉన్న కుటుంబాలకు చిరుమర్తి అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 02:59 PM

బీసీల కోసం భగ్గుమన్న సాయి చారి.. మాట తప్పిన సర్కార్‌పై మంటై ఎగిసిన ప్రాణం!

బీసీల కోసం భగ్గుమన్న సాయి చారి.. మాట తప్పిన సర్కార్‌పై మంటై ఎగిసిన ప్రాణం!

బీసీల కోసం భగ్గుమన్న సాయి చారి.. మాట తప్పిన సర్కార్‌పై మంటై ఎగిసిన ప్రాణం!
December 06, 2025 08:08 AM 36 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల లొల్లి చిలికి చిలికి గాలివానైంది.. కాదు కాదు, దావానలమైంది! బీసీలకు ఇస్తామన్న 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా సర్కారు మోసం చేసిందంటూ మనస్తాపానికి గురైన సాయి ఈశ్వర్ చారి (సాయి చారి) ఆత్మబలిదానం చేసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది.


"మోసం చేసిన్రు.. నా చావుతోనైనా కళ్లు తెరుస్తారా?" మేడ్చల్ జిల్లా, మేడిపల్లి పరిధిలో.. "మా బీసీలకు న్యాయం చేయాల్సిందే" అంటూ నినదించిన సాయి చారి, ఒంటి మీద పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నడు. "కామారెడ్డి డిక్లరేషన్‌లో చెప్పినట్టు 42 శాతం రిజర్వేషన్లు ఎక్కడికి పోయినయ్? పంచాయతీ ఎలక్షన్లలో మా సీట్లు మాకియ్యకుండా కోత పెడ్తారా?" అని ఆవేదన వ్యక్తం చేస్తూ అగ్నికి ఆహుతయ్యిండు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలిండు.


భగ్గుమన్న బీసీ లోకం: సాయి చారి మరణంతో బీసీ సంఘాలు, విద్యార్థులు రోడ్లమీదకు వచ్చిన్రు. "ఇది ఆత్మహత్య కాదు.. సర్కారు చేసిన హత్యే" అని మండిపడుతున్నారు.


"బీసీ బిడ్డ ప్రాణం పోయింది.. సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలె."


"సాయి చారి కుటుంబానికి 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇయ్యాలె."


"వెంటనే 42% రిజర్వేషన్లు అమలు చేయాలె." అంటూ డిమాండ్లతో రాష్ట్రం దద్దరిల్లుతోంది.


రాజకీయ రచ్చ: ప్రతిపక్షాలు కూడా సర్కారు తీరుపై నిప్పులు చెరుగుతున్నాయి. "ఓట్ల కోసం హామీలిచ్చి, తీరా గద్దెనెక్కాక బీసీల గొంతు కోస్తారా?" అని బీఆర్ఎస్, బీజేపీ నేతలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.


మొత్తానికి, సాయి చారి త్యాగం ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్‌లో పెను సంచలనంగా మారింది. మరి సర్కారు ఎట్లా స్పందిస్తదో చూడాలె!

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News