Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ సీఐ మన్మథ కుమార్‌ ఘన విజయం: జిల్లా పోలీస్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఎన్నిక “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 01:48 PM

బడ్జెట్ 2026–27కు ఆమోదం – జిల్లా గ్రంథాలయాల అభివృద్ధికి కీలక నిర్ణయాలు

బడ్జెట్ 2026–27కు ఆమోదం – జిల్లా గ్రంథాలయాల అభివృద్ధికి కీలక నిర్ణయాలు

బడ్జెట్ 2026–27కు ఆమోదం – జిల్లా గ్రంథాలయాల అభివృద్ధికి కీలక నిర్ణయాలు
24-02-2026 59 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి: జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సర్వసభ్య సమావేశం ఘనంగా నిర్వహించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు ఎండి అవైస్ ఉర్ రెహమాన్ చిస్తి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బడ్జెట్ అంచనాలను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు.

ఈ సమావేశానికి జిల్లా పంచాయతీ కార్యాలయ సిబ్బంది, జిల్లా విద్యాశాఖ అధికారులు, వయోజన విద్య జిల్లా ఉపసంచాలకులు, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి యం. సుధీర్తో పాటు గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు.

సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం 2026–27 బడ్జెట్ ప్రతిపాదనలను ఉన్నతాధికారుల పరిశీలన కోసం హైదరాబాద్లోని సంబంధిత శాఖలకు పంపాలని తీర్మానించారు. జిల్లా కేంద్ర గ్రంథాలయం మరియు జిల్లాలోని శాఖా గ్రంథాలయాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, పాఠకులకు మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన సదుపాయాల కల్పనకు ఆమోదం తెలిపారు.

అదేవిధంగా జిల్లా కేంద్ర గ్రంథాలయంలో దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా “దివ్యాంజన్ సెక్షన్”ను ప్రారంభించారు. ఈ విభాగం ద్వారా దివ్యాంగులకు అనుకూలమైన పుస్తకాలు, అధ్యయన వనరులు, సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యంగా నిర్ణయించారు.

జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధి ద్వారా చదువుపై ఆసక్తి పెంపొందించడం, ప్రజలకు జ్ఞాన వనరులను చేరువ చేయడం ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని సమావేశంలో పేర్కొన్నారు.

Sthanikam

బడ్జెట్ 2026–27కు ఆమోదం – జిల్లా గ్రంథాలయాల అభివృద్ధికి కీలక నిర్ణయాలు

Article Image

యాదాద్రి భువనగిరి: జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సర్వసభ్య సమావేశం ఘనంగా నిర్వహించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు ఎండి అవైస్ ఉర్ రెహమాన్ చిస్తి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బడ్జెట్ అంచనాలను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు.

ఈ సమావేశానికి జిల్లా పంచాయతీ కార్యాలయ సిబ్బంది, జిల్లా విద్యాశాఖ అధికారులు, వయోజన విద్య జిల్లా ఉపసంచాలకులు, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి యం. సుధీర్తో పాటు గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు.

సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం 2026–27 బడ్జెట్ ప్రతిపాదనలను ఉన్నతాధికారుల పరిశీలన కోసం హైదరాబాద్లోని సంబంధిత శాఖలకు పంపాలని తీర్మానించారు. జిల్లా కేంద్ర గ్రంథాలయం మరియు జిల్లాలోని శాఖా గ్రంథాలయాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, పాఠకులకు మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన సదుపాయాల కల్పనకు ఆమోదం తెలిపారు.

అదేవిధంగా జిల్లా కేంద్ర గ్రంథాలయంలో దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా “దివ్యాంజన్ సెక్షన్”ను ప్రారంభించారు. ఈ విభాగం ద్వారా దివ్యాంగులకు అనుకూలమైన పుస్తకాలు, అధ్యయన వనరులు, సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యంగా నిర్ణయించారు.

జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధి ద్వారా చదువుపై ఆసక్తి పెంపొందించడం, ప్రజలకు జ్ఞాన వనరులను చేరువ చేయడం ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని సమావేశంలో పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News