Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డీఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో పూలే జయంతి కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 12, 2026 12:55 AM

బడ్జెట్ 2026–27కు ఆమోదం – జిల్లా గ్రంథాలయాల అభివృద్ధికి కీలక నిర్ణయాలు

బడ్జెట్ 2026–27కు ఆమోదం – జిల్లా గ్రంథాలయాల అభివృద్ధికి కీలక నిర్ణయాలు

బడ్జెట్ 2026–27కు ఆమోదం – జిల్లా గ్రంథాలయాల అభివృద్ధికి కీలక నిర్ణయాలు
February 24, 2026 08:02 AM 43 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి: జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సర్వసభ్య సమావేశం ఘనంగా నిర్వహించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు ఎండి అవైస్ ఉర్ రెహమాన్ చిస్తి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బడ్జెట్ అంచనాలను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు.

ఈ సమావేశానికి జిల్లా పంచాయతీ కార్యాలయ సిబ్బంది, జిల్లా విద్యాశాఖ అధికారులు, వయోజన విద్య జిల్లా ఉపసంచాలకులు, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి యం. సుధీర్తో పాటు గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు.

సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం 2026–27 బడ్జెట్ ప్రతిపాదనలను ఉన్నతాధికారుల పరిశీలన కోసం హైదరాబాద్లోని సంబంధిత శాఖలకు పంపాలని తీర్మానించారు. జిల్లా కేంద్ర గ్రంథాలయం మరియు జిల్లాలోని శాఖా గ్రంథాలయాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, పాఠకులకు మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన సదుపాయాల కల్పనకు ఆమోదం తెలిపారు.

అదేవిధంగా జిల్లా కేంద్ర గ్రంథాలయంలో దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా “దివ్యాంజన్ సెక్షన్”ను ప్రారంభించారు. ఈ విభాగం ద్వారా దివ్యాంగులకు అనుకూలమైన పుస్తకాలు, అధ్యయన వనరులు, సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యంగా నిర్ణయించారు.

జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధి ద్వారా చదువుపై ఆసక్తి పెంపొందించడం, ప్రజలకు జ్ఞాన వనరులను చేరువ చేయడం ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని సమావేశంలో పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News