Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 06:34 AM

బడ్జెట్ 2026–27కు ఆమోదం – జిల్లా గ్రంథాలయాల అభివృద్ధికి కీలక నిర్ణయాలు

బడ్జెట్ 2026–27కు ఆమోదం – జిల్లా గ్రంథాలయాల అభివృద్ధికి కీలక నిర్ణయాలు

బడ్జెట్ 2026–27కు ఆమోదం – జిల్లా గ్రంథాలయాల అభివృద్ధికి కీలక నిర్ణయాలు
February 24, 2026 08:02 AM 48 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి: జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సర్వసభ్య సమావేశం ఘనంగా నిర్వహించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు ఎండి అవైస్ ఉర్ రెహమాన్ చిస్తి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బడ్జెట్ అంచనాలను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు.

ఈ సమావేశానికి జిల్లా పంచాయతీ కార్యాలయ సిబ్బంది, జిల్లా విద్యాశాఖ అధికారులు, వయోజన విద్య జిల్లా ఉపసంచాలకులు, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి యం. సుధీర్తో పాటు గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు.

సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం 2026–27 బడ్జెట్ ప్రతిపాదనలను ఉన్నతాధికారుల పరిశీలన కోసం హైదరాబాద్లోని సంబంధిత శాఖలకు పంపాలని తీర్మానించారు. జిల్లా కేంద్ర గ్రంథాలయం మరియు జిల్లాలోని శాఖా గ్రంథాలయాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, పాఠకులకు మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన సదుపాయాల కల్పనకు ఆమోదం తెలిపారు.

అదేవిధంగా జిల్లా కేంద్ర గ్రంథాలయంలో దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా “దివ్యాంజన్ సెక్షన్”ను ప్రారంభించారు. ఈ విభాగం ద్వారా దివ్యాంగులకు అనుకూలమైన పుస్తకాలు, అధ్యయన వనరులు, సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యంగా నిర్ణయించారు.

జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధి ద్వారా చదువుపై ఆసక్తి పెంపొందించడం, ప్రజలకు జ్ఞాన వనరులను చేరువ చేయడం ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని సమావేశంలో పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News