బడ్జెట్ 2026–27కు ఆమోదం – జిల్లా గ్రంథాలయాల అభివృద్ధికి కీలక నిర్ణయాలు
బడ్జెట్ 2026–27కు ఆమోదం – జిల్లా గ్రంథాలయాల అభివృద్ధికి కీలక నిర్ణయాలు
స్థానికం బృందం
యాదాద్రి భువనగిరి: జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సర్వసభ్య సమావేశం ఘనంగా నిర్వహించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు ఎండి అవైస్ ఉర్ రెహమాన్ చిస్తి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బడ్జెట్ అంచనాలను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు.
ఈ సమావేశానికి జిల్లా పంచాయతీ కార్యాలయ సిబ్బంది, జిల్లా విద్యాశాఖ అధికారులు, వయోజన విద్య జిల్లా ఉపసంచాలకులు, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి యం. సుధీర్తో పాటు గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు.
సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం 2026–27 బడ్జెట్ ప్రతిపాదనలను ఉన్నతాధికారుల పరిశీలన కోసం హైదరాబాద్లోని సంబంధిత శాఖలకు పంపాలని తీర్మానించారు. జిల్లా కేంద్ర గ్రంథాలయం మరియు జిల్లాలోని శాఖా గ్రంథాలయాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, పాఠకులకు మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన సదుపాయాల కల్పనకు ఆమోదం తెలిపారు.
అదేవిధంగా జిల్లా కేంద్ర గ్రంథాలయంలో దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా “దివ్యాంజన్ సెక్షన్”ను ప్రారంభించారు. ఈ విభాగం ద్వారా దివ్యాంగులకు అనుకూలమైన పుస్తకాలు, అధ్యయన వనరులు, సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యంగా నిర్ణయించారు.
జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధి ద్వారా చదువుపై ఆసక్తి పెంపొందించడం, ప్రజలకు జ్ఞాన వనరులను చేరువ చేయడం ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని సమావేశంలో పేర్కొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి