Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించిన ఏఈఓ మురళి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 10, 2026 12:54 AM

ఆయేషా కేసు మూసివేత నేరస్తులకు కొమ్ముకాయడమే’ – సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ విమర్శ

ఆయేషా కేసు మూసివేత నేరస్తులకు కొమ్ముకాయడమే’ – సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ విమర్శ

ఆయేషా కేసు మూసివేత నేరస్తులకు కొమ్ముకాయడమే’ – సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ విమర్శ
February 22, 2026 07:14 PM 55 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఆయేషా మెరా కేసును మూసివేయడంపై సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసు ఎత్తివేత ద్వారా మహిళల రక్షణలో వ్యవస్థల వైఫల్యం బహిర్గతమైందని ఆయన ఆరోపించారు.

కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ పాలనలో ‘బేటీ బచావో, బేటీ పడావో’ నినాదం ఆచరణలో కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. అదే విధంగా రాష్ట్రంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లో ప్రభుత్వ వైఖరిపై కూడా విమర్శలు చేశారు.

ఆధారాలు లేవనే కారణంతో కేసు మూసివేయడం ద్వారా మహిళల ప్రాణ, మాణాలకు భద్రత కల్పించలేమనే సందేశం వెలువడుతోందని హరినాథ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో చిన్నారులపై కూడా అత్యాచారాలు జరుగుతున్న నేపథ్యంలో శాంతిభద్రతల పరిస్థితి ఆందోళనకరమని అన్నారు.

నిందితులు పోలీసుల కస్టడీలోనే ఆత్మహత్య చేసుకున్నారని చెప్పడం అనుమానాలకు తావిస్తోందని విమర్శించారు. నిర్భయ, ఆయేషా వంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే పౌర సమాజం, మహిళా సంఘాలు, ప్రజాసంఘాలు కలిసి న్యాయపోరాటానికి సిద్ధం కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

మహిళలకు రక్షణ కల్పించేలా దోషులకు కఠిన శిక్షలు పడే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డి. హరినాథ్ డిమాండ్ చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News