ఆయేషా కేసు మూసివేత నేరస్తులకు కొమ్ముకాయడమే’ – సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ విమర్శ
ఆయేషా కేసు మూసివేత నేరస్తులకు కొమ్ముకాయడమే’ – సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ విమర్శ
GADDAM JAGANMOHAN REDDY
ఆయేషా మెరా కేసును మూసివేయడంపై సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసు ఎత్తివేత ద్వారా మహిళల రక్షణలో వ్యవస్థల వైఫల్యం బహిర్గతమైందని ఆయన ఆరోపించారు.
కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ పాలనలో ‘బేటీ బచావో, బేటీ పడావో’ నినాదం ఆచరణలో కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. అదే విధంగా రాష్ట్రంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లో ప్రభుత్వ వైఖరిపై కూడా విమర్శలు చేశారు.
ఆధారాలు లేవనే కారణంతో కేసు మూసివేయడం ద్వారా మహిళల ప్రాణ, మాణాలకు భద్రత కల్పించలేమనే సందేశం వెలువడుతోందని హరినాథ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో చిన్నారులపై కూడా అత్యాచారాలు జరుగుతున్న నేపథ్యంలో శాంతిభద్రతల పరిస్థితి ఆందోళనకరమని అన్నారు.
నిందితులు పోలీసుల కస్టడీలోనే ఆత్మహత్య చేసుకున్నారని చెప్పడం అనుమానాలకు తావిస్తోందని విమర్శించారు. నిర్భయ, ఆయేషా వంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే పౌర సమాజం, మహిళా సంఘాలు, ప్రజాసంఘాలు కలిసి న్యాయపోరాటానికి సిద్ధం కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
మహిళలకు రక్షణ కల్పించేలా దోషులకు కఠిన శిక్షలు పడే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డి. హరినాథ్ డిమాండ్ చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి