Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 02:41 AM

ఆయేషా కేసు మూసివేత నేరస్తులకు కొమ్ముకాయడమే’ – సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ విమర్శ

ఆయేషా కేసు మూసివేత నేరస్తులకు కొమ్ముకాయడమే’ – సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ విమర్శ

ఆయేషా కేసు మూసివేత నేరస్తులకు కొమ్ముకాయడమే’ – సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ విమర్శ
February 22, 2026 07:14 PM 64 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఆయేషా మెరా కేసును మూసివేయడంపై సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసు ఎత్తివేత ద్వారా మహిళల రక్షణలో వ్యవస్థల వైఫల్యం బహిర్గతమైందని ఆయన ఆరోపించారు.

కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ పాలనలో ‘బేటీ బచావో, బేటీ పడావో’ నినాదం ఆచరణలో కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. అదే విధంగా రాష్ట్రంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లో ప్రభుత్వ వైఖరిపై కూడా విమర్శలు చేశారు.

ఆధారాలు లేవనే కారణంతో కేసు మూసివేయడం ద్వారా మహిళల ప్రాణ, మాణాలకు భద్రత కల్పించలేమనే సందేశం వెలువడుతోందని హరినాథ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో చిన్నారులపై కూడా అత్యాచారాలు జరుగుతున్న నేపథ్యంలో శాంతిభద్రతల పరిస్థితి ఆందోళనకరమని అన్నారు.

నిందితులు పోలీసుల కస్టడీలోనే ఆత్మహత్య చేసుకున్నారని చెప్పడం అనుమానాలకు తావిస్తోందని విమర్శించారు. నిర్భయ, ఆయేషా వంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే పౌర సమాజం, మహిళా సంఘాలు, ప్రజాసంఘాలు కలిసి న్యాయపోరాటానికి సిద్ధం కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

మహిళలకు రక్షణ కల్పించేలా దోషులకు కఠిన శిక్షలు పడే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డి. హరినాథ్ డిమాండ్ చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News