Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధలో ఉన్న కుటుంబాలకు చిరుమర్తి అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 02:51 PM

అవినీతి అధికారుల ఇంట కోట్ల రూపాయలు లోకాయుక్త దాడిలో కట్టల కొద్ది నగదు

అవినీతి అధికారుల ఇంట కోట్ల రూపాయలు లోకాయుక్త దాడిలో కట్టల కొద్ది నగదు

అవినీతి అధికారుల ఇంట కోట్ల రూపాయలు లోకాయుక్త దాడిలో కట్టల కొద్ది నగదు
February 16, 2026 06:12 AM 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

బెంగళూరు: అవినీతిపై కట్టుదిట్టమైన చర్యలు కొనసాగిస్తున్న కర్ణాటక లోకాయుక్త అధికారులు తాజాగా ఇద్దరు ఉన్నతాధికారుల ఇళ్లపై నిర్వహించిన సోదాలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో భాగంగా ఈ దాడులు చేపట్టారు.కెఆర్ఈఐఎస్ సూపరింటెండింగ్ ఇంజనీర్‌పై కేసు

కర్ణాటక రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ అసోసియేషన్ (కెఆర్ఈఐఎస్) సూపరింటెండింగ్ ఇంజనీర్ హెచ్.ఎం. జనార్దన్‌పై బెంగళూరు రూరల్ లోకాయుక్త పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. చట్టవిరుద్ధంగా భారీగా ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలతో ఆయనకు సంబంధించిన ఆరు ప్రాంతాల్లో ఒకేసారి సోదాలు నిర్వహించారు.

ఈ దాడుల్లో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. జనార్దన్ స్నేహితుడు సుజయ్ శెట్టి నివాసంలో సోదాలు చేయగా ఏకంగా రూ.1.70 కోట్ల నగదు లభించింది. నోట్ల కట్టలను లెక్కపెట్టేందుకు యంత్రాలు కూడా వేడెక్కేంతగా నగదు దొరికినట్లు అధికారులు తెలిపారు. రబ్బరు బ్యాండ్లు కట్టడంలోనే సిబ్బంది చేతులు అలసిపోయాయని సమాచారం.

పిడబ్లూడి చీఫ్ ఇంజనీర్ ఇంట్లో భారీ సోదాలు మరోవైపు, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (పిడబ్లూడి) చీఫ్ ఇంజనీర్ పురుషోత్తం నివాసంలో కూడా భారీ దాడులు జరిగాయి. గురువారం ఉదయం బెంగళూరులోని పద్మనాభనగర్ ప్రాంతంలో ఉన్న ఆయన మూడు అంతస్తుల విలాసవంతమైన బంగ్లాకు 10 మందికి పైగా అధికారులు రెండు వాహనాల్లో చేరుకుని సుమారు ఐదారు గంటల పాటు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో లక్షల రూపాయల నగదు, భారీగా బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవలే నిర్మించిన ఈ ఇంటికి అట్టహాసంగా గృహప్రవేశం నిర్వహించారని స్థానికులు చెబుతున్నారు. మొత్తం రూ.23 కోట్లకు పైగా ఆస్తుల గుర్తింపు

ఇప్పటివరకు జరిగిన సోదాల్లో నలుగురు అధికారులకు సంబంధించిన రూ.23 కోట్లకు పైగా ఆస్తులను గుర్తించినట్లు లోకాయుక్త వర్గాలు వెల్లడించాయి. నగదు, బంగారం, స్థిరాస్తులు, విలువైన పత్రాలు వంటి ఆధారాలను సీజ్ చేసి విచారణను మరింత వేగవంతం చేశారు. ఈ ఘటనతో పరిపాలనా వర్గాల్లో తీవ్ర చర్చ నెలకొంది. అవినీతిపై కఠిన చర్యలు తీసుకుంటామని లోకాయుక్త అధికారులు స్పష్టం చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News