అవకాశం కల్పిస్తే నిస్వార్థంగా సేవ చేస్తా.బీఆర్ఎస్ అభ్యర్థి శేపూరి జయమ్మ రవీందర్ హామీ
అవకాశం కల్పిస్తే నిస్వార్థంగా సేవ చేస్తా.బీఆర్ఎస్ అభ్యర్థి శేపూరి జయమ్మ రవీందర్ హామీ
స్థానికం బృందం
మూడో వార్డులో ఇంటింటి ఎన్నికల ప్రచారం
చిట్యాల మున్సిపాలిటీలోని మూడో వార్డులో అపరిష్కృతంగా ఉన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తానని బీఆర్ఎస్ అభ్యర్థి శేపూరి జయమ్మ రవీందర్ అన్నారు. శనివారం మూడో వార్డులో ఇంటింటా తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గతంలో తాను చిట్యాల ఎంపీటీసీ సభ్యురాలిగా, తన భర్త రవీందర్ జెడ్పీటీసీ సభ్యుడిగా, కౌన్సిలర్గా ప్రజలకు సేవలందించామని గుర్తు చేశారు. మరోసారి ప్రజలు అవకాశం కల్పిస్తే నిస్వార్థంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు.మూడో వార్డులో డ్రెయినేజీ సమస్యలు, సీసీ రోడ్ల నిర్మాణం, తాగునీరు, విద్యుత్ సమస్యలను ప్రాధాన్యంగా తీసుకుని పరిష్కరిస్తామని తెలిపారు. ప్రజల అవసరాలకు అందుబాటులో ఉంటూ వార్డు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానన్నారు.ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు బొక్కా మాధవరెడ్డి, కునూరు ముత్తయ్య ఎస్కే చాంద్,పర్నే నరేందర్రెడ్డి, వల్లమల్ల యాదగిరి, షాహీన్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి