అందోల్, స్థానిక ప్రతినిధి:
సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం లో 99టీవీ 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ ఘనంగా జరిగింది. అందోల్ నియోజక వర్గానికి సంబందించిన వివిధ పార్టీల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. చౌటకూరు గ్రామ సర్పంచ్ పార్కల రాంరెడ్డి మరియు మాసన్ పల్లి గ్రామ సర్పంచ్ బంటు సత్యనారాయణ, మాసన్ పల్లి శివారులో గల పెద్దమ్మ తల్లి దేవాలయ చైర్మన్ నారాయణ ముదిరాజ్ చేతుల మీదుగా నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో ఉన్నటువంటి సమస్యలను ఎత్తిచూపడంలో మీడియా ముందుంటుందని సమాజానికి ఫోర్త్ పిల్లర్ లా మీడియా పని చేస్తుందని, 99టీవీ వీక్షకులకు యాజమాన్యానికి ఆందోల్ నియోజకవర్గం ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి