Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:58 PM

అశ్వారావుపేట ఆసుపత్రిలో అపురూప దృశ్యం

అశ్వారావుపేట ఆసుపత్రిలో అపురూప దృశ్యం

అశ్వారావుపేట ఆసుపత్రిలో అపురూప దృశ్యం
March 22, 2026 06:58 PM 134 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అశ్వారావుపేట ప్రభుత్వ వైద్యశాలలో హృదయాన్ని కదిలించే అపురూప దృశ్యం కనిపించింది. ఆసుపత్రి బెడ్‌పై అనారోగ్యంతో బాధపడుతున్న భార్యకు, వణుకుతున్న చేతులతో అన్నం ముద్దలు తినిపిస్తున్న వృద్ధ భర్త అక్కడి వారిని భావోద్వేగానికి గురిచేశాడు.

వయసు పైబడినా, కష్టకాలంలోనూ భార్యను వదలని ఆ భర్త చూపిన ప్రేమ, అనుబంధం చూసిన ప్రతి ఒక్కరూ మంత్ర ముగ్ధులవుతున్నారు. ఈ దృశ్యం నిజమైన దాంపత్య బంధానికి నిలువెత్తు ఉదాహరణగా నిలిచింది.

చిన్నచిన్న కారణాలతోనే సంబంధాలను విరిచేస్తున్న నేటి సమాజంలో, ఈ వృద్ధ దంపతులు తోడు నీడగా నిలిచిన తీరు మానవీయ విలువలకు అద్దం పడుతోంది. ఆసుపత్రిలో ఉన్న రోగులు, వారి బంధువులు ఈ ఘటనను చూసి ప్రశంసలు కురిపిస్తున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News