అసెంబ్లీలో ప్రజా సమస్యలు చర్చించండి! సీపీఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి హరినాథ్
అసెంబ్లీలో ప్రజా సమస్యలు చర్చించండి! సీపీఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి హరినాథ్
GADDAM JAGANMOHAN REDDY
రాష్ట్రంలో అధికార పక్షం ప్రతిపక్షం ప్రజా సమస్యలు గాలికి వదిలి తిరుపతి లడ్డు లో కొవ్వు నిజం !నెయ్యి అబద్ధం అనేది తేల్చుకుంటానికి 11 నుంచి జరిగే రాష్ట్ర అసెంబ్లీకి రమ్మని జగన్ వర్గాన్ని సవాల్ చేయటాన్ని ప్రజలు ఈసడించుకుంటున్నారని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి హరినాథ్ విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రజలను పక్కదారి పట్టించడానికి అధికార పక్షం సమాయత్తమవుతోందన్నారు.అభివృద్ధి జపం చేసే చంద్రబాబు దావోస్ కి వెళ్ళినా ఒక్క పరిశ్రమ రాలేదనిరాష్ట్రానికి ఒరిగింది శూన్యం అన్నారు. ఎన్డీఏ భాగస్వామిగా కేంద్రానికి చంద్రబాబు రాష్ట్ర ప్రజలను తాకట్టు పెడుతున్నారని హరినాథ్ విమర్శించారు. ఆంధ్ర తెలంగాణ మధ్య గోదావరి కృష్ణ జలాల పంపకము ప్రాజెక్టులువిషయంలో వివాదాలు రెచ్చగొట్టి కేంద్రం సోద్యం చూస్తోందన్నారు. అమరావతి రాజధానికి బడ్జెట్లో నిధులు కేటాయించకపోగా గుర్తింపు ఇవ్వడానికి కూడా కొర్రీలు పెడుతోందని హరినాథ్. విమర్శించారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్చి రాష్ట్రంపై 40 శాతం భారం వేసినా చంద్రబాబు గొంతు మూగబోయిందన్నారు. కార్మికులకు హక్కుల హరించి నాలుగు లేబర్ కోడ్లు తెచ్చినమోడీమెప్పు కోసమే కార్మికుల పని గంటలు పెంచే విధంగా రాష్ట్ర అసెంబ్లీలో చంద్రబాబుబిల్లు చేశారని హరినాథ్ విమర్శించారు. ప్రతిపక్షం బలహీనతలను సొమ్ము చేసుకుని 14వైద్య కళాశాలలను పి పి పీ పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం అన్యాయం కాదా? అని హరినాథ్ ప్రశ్నించారు. ప్రభుత్వ భూములను లూలూమాల్ లాంటి సంస్థలకు, రాందేవ్ బాబా లాంటి వారికి, పారిశ్రామికవేత్తలకు 99 పైసెలకు 40, 50 సంవత్సరాలకు పైగా కట్ట పెట్టే విధానాలను అసెంబ్లీలో అధికార పక్షం సమాధానం చెప్పేలానిలదీసే విధంగా ప్రతిపక్షం ఉండాల న్నారు. ప్రతిపక్ష పాత్ర నిర్వహించకుండా పాదయాత్రలు చేసినా ప్రయోజనం ఏమిటని జగన్ మోహన్ రెడ్డిని హరినాథ్ ప్రశ్నించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి