Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:03 PM

అసెంబ్లీలో ప్రజా సమస్యలు చర్చించండి! సీపీఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి హరినాథ్

అసెంబ్లీలో ప్రజా సమస్యలు చర్చించండి! సీపీఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి హరినాథ్

అసెంబ్లీలో ప్రజా సమస్యలు చర్చించండి! సీపీఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి హరినాథ్
January 31, 2026 07:38 PM 57 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

రాష్ట్రంలో అధికార పక్షం ప్రతిపక్షం ప్రజా సమస్యలు గాలికి వదిలి తిరుపతి లడ్డు లో కొవ్వు నిజం !నెయ్యి అబద్ధం అనేది తేల్చుకుంటానికి 11 నుంచి జరిగే రాష్ట్ర అసెంబ్లీకి రమ్మని జగన్ వర్గాన్ని సవాల్ చేయటాన్ని ప్రజలు ఈసడించుకుంటున్నారని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి హరినాథ్ విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రజలను పక్కదారి పట్టించడానికి అధికార పక్షం సమాయత్తమవుతోందన్నారు.అభివృద్ధి జపం చేసే చంద్రబాబు దావోస్ కి వెళ్ళినా ఒక్క పరిశ్రమ రాలేదనిరాష్ట్రానికి ఒరిగింది శూన్యం అన్నారు. ఎన్డీఏ భాగస్వామిగా కేంద్రానికి చంద్రబాబు రాష్ట్ర ప్రజలను తాకట్టు పెడుతున్నారని హరినాథ్ విమర్శించారు. ఆంధ్ర తెలంగాణ మధ్య గోదావరి కృష్ణ జలాల పంపకము ప్రాజెక్టులువిషయంలో వివాదాలు రెచ్చగొట్టి కేంద్రం సోద్యం చూస్తోందన్నారు. అమరావతి రాజధానికి బడ్జెట్లో నిధులు కేటాయించకపోగా గుర్తింపు ఇవ్వడానికి కూడా కొర్రీలు పెడుతోందని హరినాథ్. విమర్శించారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్చి రాష్ట్రంపై 40 శాతం భారం వేసినా చంద్రబాబు గొంతు మూగబోయిందన్నారు. కార్మికులకు హక్కుల హరించి నాలుగు లేబర్ కోడ్లు తెచ్చినమోడీమెప్పు కోసమే కార్మికుల పని గంటలు పెంచే విధంగా రాష్ట్ర అసెంబ్లీలో చంద్రబాబుబిల్లు చేశారని హరినాథ్ విమర్శించారు. ప్రతిపక్షం బలహీనతలను సొమ్ము చేసుకుని 14వైద్య కళాశాలలను పి పి పీ పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం అన్యాయం కాదా? అని హరినాథ్ ప్రశ్నించారు. ప్రభుత్వ భూములను లూలూమాల్ లాంటి సంస్థలకు, రాందేవ్ బాబా లాంటి వారికి, పారిశ్రామికవేత్తలకు 99 పైసెలకు 40, 50 సంవత్సరాలకు పైగా కట్ట పెట్టే విధానాలను అసెంబ్లీలో అధికార పక్షం సమాధానం చెప్పేలానిలదీసే విధంగా ప్రతిపక్షం ఉండాల న్నారు. ప్రతిపక్ష పాత్ర నిర్వహించకుండా పాదయాత్రలు చేసినా ప్రయోజనం ఏమిటని జగన్ మోహన్ రెడ్డిని హరినాథ్ ప్రశ్నించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News