Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 24, 2026 02:01 AM

అర్హులైన పేదలందరికీ పింఛన్లు – కూటమి ప్రభుత్వం కట్టుబాటు.మాన్వి దేవేంద్రప్ప

అర్హులైన పేదలందరికీ పింఛన్లు – కూటమి ప్రభుత్వం కట్టుబాటు.మాన్వి దేవేంద్రప్ప

అర్హులైన పేదలందరికీ పింఛన్లు – కూటమి ప్రభుత్వం కట్టుబాటు.మాన్వి దేవేంద్రప్ప
January 31, 2026 11:38 AM 15 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

ఆదోని,

అర్హులైన పేదలందరికీ పింఛన్లు అందించే దిశగా కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని, పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురువ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప తెలిపారు.ఆదోని నియోజకవర్గంలోని బలాదూర్, దిబ్బేణేకల్ గ్రామాల్లో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ పండుగ వాతావరణంలో సాగుతోందన్నారు. రేపు ఒకటవ తేది సెలవు దినం కావడంతో లబ్ధిదారులకు ఒక రోజు ముందుగానే పింఛన్లు అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదని పేర్కొన్నారు.

తెల్లవారుజాము నుంచే ఆదోని నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్ల పంపిణీ ప్రారంభమైందని తెలిపారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి రెండూ సమపాళ్లలో ముందుకు సాగుతున్నాయని, రానున్న రోజుల్లో రాష్ట్ర భవిష్యత్తు, అభివృద్ధికి చంద్రబాబు దూరదృష్టితో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని చెప్పారు.ప్రతి పేదవాడికి న్యాయం చేకూరేలా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని, రాష్ట్రవ్యాప్తంగా అరవై ఐదు లక్షల మందికి ఇరవై నాలుగు రకాల పింఛన్లు అందిస్తున్నామని వివరించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లుగా భావించి ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.అనంతరం బలాదూర్ ఎల్లమ్మ దేవి రథోత్సవం సందర్భంగా అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News