Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 01:43 AM

ఆర్ఎంపీ వేధింపులు… నర్సు ఆత్మహత్య

ఆర్ఎంపీ వేధింపులు… నర్సు ఆత్మహత్య

ఆర్ఎంపీ వేధింపులు… నర్సు ఆత్మహత్య
April 21, 2026 08:51 AM 73 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పల్నాడు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆర్ఎంపీ వేధింపులకు గురై నర్సు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సత్తెనపల్లి మండలంలో కలకలం రేపింది.

కందులవారిపాలెం గ్రామానికి చెందిన గోవర్ధన (40) గత పదేళ్లుగా సత్తెనపల్లిలోని గాంధీచౌక్ ప్రాంతంలో ఆర్ఎంపీ నాగేశ్వరరావు వద్ద నర్సుగా పనిచేస్తోంది. ఇటీవల ఓ మహిళ విషయంపై ఆర్ఎంపీ తనపై చెయ్యి చేసుకున్నాడని గోవర్ధన తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ విషయాన్ని తన కుమారుడు త్రిలోక్ రెడ్డికి తెలిపి బాధ వ్యక్తం చేసింది.

తరువాత ఇంటి బెడ్రూమ్‌లోకి వెళ్లిన ఆమె ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News