పల్నాడు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆర్ఎంపీ వేధింపులకు గురై నర్సు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సత్తెనపల్లి మండలంలో కలకలం రేపింది.
కందులవారిపాలెం గ్రామానికి చెందిన గోవర్ధన (40) గత పదేళ్లుగా సత్తెనపల్లిలోని గాంధీచౌక్ ప్రాంతంలో ఆర్ఎంపీ నాగేశ్వరరావు వద్ద నర్సుగా పనిచేస్తోంది. ఇటీవల ఓ మహిళ విషయంపై ఆర్ఎంపీ తనపై చెయ్యి చేసుకున్నాడని గోవర్ధన తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ విషయాన్ని తన కుమారుడు త్రిలోక్ రెడ్డికి తెలిపి బాధ వ్యక్తం చేసింది.
తరువాత ఇంటి బెడ్రూమ్లోకి వెళ్లిన ఆమె ఫ్యాన్కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి