Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మేడిపల్లిలో ఆధునిక ‘యాదాద్రి హాస్పిటల్’ ప్రారంభించిన ప్రభుత్వ విప్ వేముల కెనరా బ్యాంకులో గోల్డ్ లోన్‌కు కొత్త షరతులు… వినియోగదారుల ఇబ్బందులు 131వ సవరణ: ప్రజాస్వామ్య బలోపేతమా? లేక కొత్త సవాళ్ల ఆరంభమా? ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 21, 2026 11:57 AM

ఆర్ఎంపీ వేధింపులు… నర్సు ఆత్మహత్య

ఆర్ఎంపీ వేధింపులు… నర్సు ఆత్మహత్య

ఆర్ఎంపీ వేధింపులు… నర్సు ఆత్మహత్య
April 21, 2026 08:51 AM 33 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పల్నాడు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆర్ఎంపీ వేధింపులకు గురై నర్సు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సత్తెనపల్లి మండలంలో కలకలం రేపింది.

కందులవారిపాలెం గ్రామానికి చెందిన గోవర్ధన (40) గత పదేళ్లుగా సత్తెనపల్లిలోని గాంధీచౌక్ ప్రాంతంలో ఆర్ఎంపీ నాగేశ్వరరావు వద్ద నర్సుగా పనిచేస్తోంది. ఇటీవల ఓ మహిళ విషయంపై ఆర్ఎంపీ తనపై చెయ్యి చేసుకున్నాడని గోవర్ధన తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ విషయాన్ని తన కుమారుడు త్రిలోక్ రెడ్డికి తెలిపి బాధ వ్యక్తం చేసింది.

తరువాత ఇంటి బెడ్రూమ్‌లోకి వెళ్లిన ఆమె ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News