Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 11:08 PM

ఆర్ఎంపీ వేధింపులు… నర్సు ఆత్మహత్య

ఆర్ఎంపీ వేధింపులు… నర్సు ఆత్మహత్య

ఆర్ఎంపీ వేధింపులు… నర్సు ఆత్మహత్య
21-04-2026 77 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పల్నాడు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆర్ఎంపీ వేధింపులకు గురై నర్సు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సత్తెనపల్లి మండలంలో కలకలం రేపింది.

కందులవారిపాలెం గ్రామానికి చెందిన గోవర్ధన (40) గత పదేళ్లుగా సత్తెనపల్లిలోని గాంధీచౌక్ ప్రాంతంలో ఆర్ఎంపీ నాగేశ్వరరావు వద్ద నర్సుగా పనిచేస్తోంది. ఇటీవల ఓ మహిళ విషయంపై ఆర్ఎంపీ తనపై చెయ్యి చేసుకున్నాడని గోవర్ధన తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ విషయాన్ని తన కుమారుడు త్రిలోక్ రెడ్డికి తెలిపి బాధ వ్యక్తం చేసింది.

తరువాత ఇంటి బెడ్రూమ్‌లోకి వెళ్లిన ఆమె ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Sthanikam

ఆర్ఎంపీ వేధింపులు… నర్సు ఆత్మహత్య

Article Image

పల్నాడు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆర్ఎంపీ వేధింపులకు గురై నర్సు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సత్తెనపల్లి మండలంలో కలకలం రేపింది.

కందులవారిపాలెం గ్రామానికి చెందిన గోవర్ధన (40) గత పదేళ్లుగా సత్తెనపల్లిలోని గాంధీచౌక్ ప్రాంతంలో ఆర్ఎంపీ నాగేశ్వరరావు వద్ద నర్సుగా పనిచేస్తోంది. ఇటీవల ఓ మహిళ విషయంపై ఆర్ఎంపీ తనపై చెయ్యి చేసుకున్నాడని గోవర్ధన తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ విషయాన్ని తన కుమారుడు త్రిలోక్ రెడ్డికి తెలిపి బాధ వ్యక్తం చేసింది.

తరువాత ఇంటి బెడ్రూమ్‌లోకి వెళ్లిన ఆమె ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News