Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రత్యామ్నాయ పంటల వివరాల కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు ఓటర్ల వివరాల సేకరణ ఫారాలను వెంటనే అందజేయాలి:- ఆర్డీవో సువర్ణ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 01:46 AM

అర్ధరాత్రి రైలులో అగ్నిప్రమాదం: టాటా-ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ ఏసీ బోగీలు దగ్ధం

అర్ధరాత్రి రైలులో అగ్నిప్రమాదం: టాటా-ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ ఏసీ బోగీలు దగ్ధం

అర్ధరాత్రి రైలులో అగ్నిప్రమాదం: టాటా-ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ ఏసీ బోగీలు దగ్ధం
December 29, 2025 05:57 AM 94 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nagole
Chanikya Madhu

నర్సింగబల్లి - ఎలమంచిలి మధ్య చెలరేగిన మంటలు.. ఒకరు సజీవ దహనం. ప్రయాణికుల

ఎలమంచిలి/అనకాపల్లి (స్థానికం): విశాఖ జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి పెను ప్రమాదం సంభవించింది. టాటా నగర్ నుండి ఎర్నాకుళం వెళ్లే టాటా-ఎర్నాకుళం (18189) ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో రెండు ఏసీ బోగీలు పూర్తిగా దగ్ధం కాగా, ఒక ప్రయాణికుడు మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారు.

ఘటన ఎలా జరిగిందంటే?

విశాఖ జిల్లా దువ్వాడ మీదుగా వెళ్తున్న ఈ రైలు, అనకాపల్లి దాటిన తర్వాత నర్సింగబల్లి వద్దకు చేరుకోగానే బీ1 (B1) బోగీ బ్రేకులు పట్టేయడంతో అగ్నికీలలు మొదలైనట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 1:30 గంటల సమయంలో మంటలు చెలరేగి ప్యాంట్రీ కారును ఆనుకుని ఉన్న B1, M2 ఏసీ బోగీలకు వేగంగా వ్యాపించాయి.

ఎలమంచిలి సమీపంలోని పాయింట్‌ వద్ద లోకో పైలట్లు మంటలను గుర్తించి వెంటనే స్టేషన్‌లో రైలును నిలిపివేసి అధికారులను అప్రమత్తం చేశారు. అప్పటికే దట్టమైన పొగ బోగీలను కమ్మేయడంతో గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులు ఊపిరాడక, ప్రాణభయంతో బోగీల నుంచి కిందకు దూకి పరుగులు తీశారు.

ఒకరి మృతి - భారీ ఆస్తి నష్టం

ఈ ప్రమాదంలో దురదృష్టవశాత్తు విశాఖపట్నానికి చెందిన చంద్రశేఖర్ సుందర్ (70) అనే వృద్ధుడు మంటల్లో చిక్కుకుని సజీవ దహనమైనట్లు అధికారులు ధృవీకరించారు.

• మంటల ధాటికి రెండు ఏసీ బోగీలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి.

• ప్రయాణికుల విలువైన సామాగ్రి, వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి.

• అనకాపల్లి, ఎలమంచిలి, నక్కపల్లి ప్రాంతాల నుంచి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.

స్తంభించిన రైల్వే మార్గం

ప్రమాదం కారణంగా విశాఖ - విజయవాడ మార్గంలో రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అర్ధరాత్రి వేళ కటిక చలిలో సుమారు 2,000 మంది ప్రయాణికులు స్టేషన్‌లోనే పడిగాపులు పడ్డారు. రైల్వే ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు.

తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో కాలిపోయిన బోగీలను వేరు చేసి, ఆ బాధితులను ఇతర బోగీల్లో సర్దుబాటు చేసి రైలును పంపించి వేయడానికి ఏర్పాట్లు చేశారు. ఘటనపై రైల్వే శాఖ విచారణకు ఆదేశించింది


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News