అప్పుల భారాన్ని అధిగమిస్తూ అభివృద్ధి దిశగా అడుగులు… 2026-27 బడ్జెట్పై ప్రశంసలు
అప్పుల భారాన్ని అధిగమిస్తూ అభివృద్ధి దిశగా అడుగులు… 2026-27 బడ్జెట్పై ప్రశంసలు
GADDAM JAGANMOHAN REDDY
రూ.10 లక్షల కోట్ల అప్పుల భారాన్ని వారసత్వంగా స్వీకరించిన రాష్ట్రాన్ని ఆర్థిక క్రమశిక్షణతో నిలదొక్కిస్తూ, అభివృద్ధి–సంక్షేమానికి సమన్వయం కల్పించిన 2026-27 బడ్జెట్పై మంత్రి పార్థసారథి ఘనంగా స్పందించారు.
నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సారథ్యంలో కూటమి ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక దిశను మలుపుతిప్పిందని ఆయన పేర్కొన్నారు.
లోటులు తగ్గింపు – క్రమశిక్షణకు కఠిన నిదర్శనం
గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో 4.41 శాతంగా ఉన్న రెవెన్యూ లోటు 1.11 శాతానికి పడిపోవడం, ద్రవ్యలోటు 3.84 శాతానికి కట్టడి కావడం రాష్ట్ర ఆర్థిక పునరుద్ధరణకు బలమైన సంకేతాలని మంత్రి స్పష్టం చేశారు.
మూలధన వ్యయం రూ.27,000 కోట్ల నుంచి రూ.48,697 కోట్లకు పెరగడం రోడ్లు, నీటిపారుదల, పంచాయతీరాజ్ రంగాలకు ఊపిరినిచ్చే నిర్ణయమన్నారు.
నీటిపారుదలలో కొత్త ఊపు
రూ.10,969 కోట్ల నుంచి రూ.18,229 కోట్లకు కేటాయింపులు పెరగడం ద్వారా నిలిచిపోయిన ప్రాజెక్టులకు ప్రాణం పోసినట్టేనని అన్నారు. చింతలపూడి వంటి ప్రాజెక్టులు ముందుకు సాగే దిశగా స్పష్టమైన చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.
రాయలసీమ అభివృద్ధికి నల్లమల్ల సాగర్, రూ.30,000 కోట్ల హార్టికల్చర్ హబ్ వంటి నిర్ణయాలు కరవు నేలలను సస్యశ్యామలంగా మార్చే చారిత్రాత్మక మలుపులని అభివర్ణించారు.
సంక్షేమానికి భారీ ఊతం
సంక్షేమ కేటాయింపులు రూ.51,292 కోట్ల నుంచి రూ.91,529 కోట్లకు పెరగడం సామాజిక న్యాయానికి కట్టుబాటుని చాటుతుందన్నారు. 43 లక్షల మందికి మాత్రమే అందిన పథకాలను విస్తరించి 67.27 లక్షల మంది విద్యార్థులకు “తల్లికి వందనం” ద్వారా లబ్ధి చేకూర్చడం విశేషమన్నారు.
పెన్షన్ – మాట నిలబెట్టిన ప్రభుత్వం
రూ.3,000 హామీని ఆలస్యంగా అమలు చేసిన గత పాలనకు భిన్నంగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.4,000 పెన్షన్ అమలు చేసి, రెండు నెలల బకాయిలు కూడా చెల్లించడం ప్రజల పట్ల నిబద్ధతను చూపిందన్నారు.
రైతు భరోసా – చిత్తశుద్ధి స్పష్టంగా
ధరల స్థిరీకరణ నిధి వినియోగంలో స్పష్టత తీసుకొచ్చి రైతులకు అవసరమైనప్పుడు తోడుగా నిలిచిందన్నారు. జల జీవన్ మిషన్ నిధులను సమర్థంగా వినియోగిస్తూ గ్రామీణ ప్రాంతాలకు తాగునీరు అందించే కట్టుబాటు చూపిందన్నారు.
రాజధాని–గృహనిర్మాణానికి బలమైన బాట
అమరావతి రాజధాని నిర్మాణానికి రూ.57,868 కోట్ల పనులకు పరిపాలన అనుమతులు ఇవ్వడం అభివృద్ధి పట్ల ప్రభుత్వ దృఢసంకల్పాన్ని సూచిస్తోందన్నారు. గృహనిర్మాణానికి రూ.6,250 కోట్లు కేటాయించి ప్రతి పేదవాడికి ఇల్లు అందించాలన్న లక్ష్యానికి బడ్జెట్ బలమైన పునాది వేసిందని తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి