ఆంధ్రప్రదేశ్లో పెన్షన్లు ఒకరోజు ముందే పంపిణీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
ఆంధ్రప్రదేశ్లో పెన్షన్లు ఒకరోజు ముందే పంపిణీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
GADDAM JAGANMOHAN REDDY
సీఎం చంద్రబాబు నిర్ణయం – ఈనెల 28న పింఛన్లు అందజేత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పెన్షన్ దారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. మార్చి ఒకటో తేదీ ఆదివారం కావడంతో ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ఉండనుంది. ఈ నేపథ్యంలో పెన్షన్లను ఒకరోజు ముందుగానే, ఈనెల 28వ తేదీ శనివారం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించాలని స్పష్టం చేశారు. పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో మంత్రులు, కూటమి ఎమ్మెల్యేలు తప్పనిసరిగా పాల్గొనాలని సూచించారు.
పెన్షన్ అందుకోలేని లబ్ధిదారులకు మార్చి రెండవ తేదీన కూడా పంపిణీ చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
శ్రీకాకుళంలో డయేరియా అంశంపై ఆందోళన
అదే సమయంలో శ్రీకాకుళం జిల్లాలో డయేరియా వ్యాప్తి అంశంపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. తాగునీటి సరఫరాలో ఎటువంటి లోపాలు ఉండకూడదని, నీటి కాలుష్యాన్ని అరికట్టేందుకు క్లోరినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
మురుగునీటి కాలువల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రజలను డయేరియా వ్యాధి పట్ల అప్రమత్తం చేయాలని స్పష్టం చేశారు. పరిశుభ్రత, శుద్ధజల సరఫరా విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి