Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
Community Power for Health: Walkathon Sparks Preventive Care Movement సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 02:01 PM

ఆంధ్రప్రదేశ్ లో జగన్ గెలవాలంటే ? ఏం చేయాలో చెప్పిన షర్మిల..! పాదయాత్రపై సెటైర్లు

ఆంధ్రప్రదేశ్ లో జగన్ గెలవాలంటే ? ఏం చేయాలో చెప్పిన షర్మిల..! పాదయాత్రపై సెటైర్లు

ఆంధ్రప్రదేశ్ లో జగన్ గెలవాలంటే ? ఏం చేయాలో చెప్పిన షర్మిల..! పాదయాత్రపై సెటైర్లు
January 30, 2026 02:50 PM 101 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఆంధ్ర ప్రదేశ్ జనవరి 30(స్ధానికం ప్రతినిధి గడ్డం జగన్మోహన్ రెడ్డి) ఏపీలో గత అసెంబ్లీ ఎన్నికల ముందు పీసీసీ అధ్యక్షురాలిగా ఎంట్రీ ఇచ్చి అనూహ్యంగా తనకు ఆస్తులు ఇవ్వని అన్న వైఎస్ జగన్ ను టార్గెట్ చేయడం ప్రారంభించిన వైఎస్ షర్మిల (ys sharmila).. కూటమి అధికారంలోకి వచ్చాక కూడా అదే తీరు కొనసాగించారు. కానీ కొంతకాలంగా జగన్ విషయంలో ఆరోపణలకు బ్రేక్ ఇచ్చిన వైఎస్ షర్మిల తిరిగి నిన్న ఆయన పాదయాత్రను టార్గెట్ చేస్తూ విమర్శలకు దిగారు. పాదయాత్ర ఇప్పుడు ఎందుకని ప్రశ్నించిన షర్మిల.. అధికారం ఇస్తే ఏం చేశారని నిలదీశారు.

జగన్ పాదయాత్ర ఎందుకు ? అధికారం కోసమే కదా ఈ పాట్లు ? అధికారం ఇస్తే ఏం చేశారు ? వైఎస్సార్ జలయజ్ఞం పూర్తి చేయగలిగారా? నవరత్నాల్లో పెట్టిన హామీలకు దిక్కులేదన్నారు. అధికారంలో వచ్చిన 6 నెలల్లో పూర్తి చేస్తా అన్నారని,

అధికారం ఇస్తే ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. మద్యనిషేధం అన్నారని, అధికారం ఇస్తే కల్తీ మద్యం పెట్టి , క్యాష్ పద్ధతిలో మద్య మాఫియా చేశారన్నారు

వేల ఏళ్ల నుంచి నిలబడ్డ రుషికొండను బోడి గుండు చేశారని షర్మిల ఆరోపించారు. అధికారం ఇస్తే ఒక్క రోజు కూడా బయటకు రాలేదని, ఆ పార్టీ వాళ్ళకే అందుబాటులో లేదని విమర్శించారు. ఎన్నికలకి 6 నెలల ముందు బయటకు వచ్చి సిద్ధం అంటూ కొన్ని నెలలు తిరిగారన్నారు. అంతే తప్పిస్తే ఒకరోజు అయినా ప్రజల కోసం బయటకు వచ్చారా ? అని ప్రశ్నించారు. ఒక మనిషి నిజమైన నైజం తెలియాలి అంటే అధికారం ఇచ్చి చూడాలన్న అబ్రహం లింకన్ మాటల్ని గుర్తుచేశారు. జగన్ ని అధికారంలో చూశామని, ఆయనకు అధికారం సూట్ అవ్వలేదని తెలిపారు. జగన్ నేచర్ మారాలని, నైజం మారాలని,మార్పు రావాలని సూచించారు. జగన్ లో స్వార్థం తగ్గి మంచితనం పెరగాలన్నారు. అప్పుడు దేవుడు అధికారం ఇస్తాడేమో అన్నారు. అంతవరకు దేవుడు , ప్రజలు ఆశీర్వదించడన్నారు. ఏడాది న్నర తర్వాత చేసే పాదయాత్రకు ఇప్పుడు అనౌన్స్ ఎందుకని ప్రశ్నించారు. చిత్తశుద్ధి లేని యాత్రలు ఎందుకన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News