అమరావతి: సీఎస్ మార్పు.. సాయి ప్రసాద్ బాధ్యతల స్వీకరణకు సిద్ధం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా ఉన్న విజయానంద్ ఎల్లుండి పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో నూతన సీఎస్గా సాయి ప్రసాద్ బాధ్యతలు స్వీకరించనున్నారు.
రాష్ట్ర పరిపాలనలో కీలక పాత్ర పోషించిన విజయానంద్ సేవలను మరికొంత కాలం వినియోగించుకోవాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో ఎక్స్ అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విజయానంద్ను నియమించే అవకాశాలు ఉన్నాయని వర్గాలు చెబుతున్నాయి.
సీఎస్ మార్పు నేపథ్యంలో పరిపాలనలో కొత్త దశకు శ్రీకారం చుట్టనున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి