Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:51 PM

అల్పపీడనాలు- ఫిబ్రవరి 19కి తర్వాత తెలుగు రాష్ట్రాలకు అలెర్ట్

అల్పపీడనాలు- ఫిబ్రవరి 19కి తర్వాత తెలుగు రాష్ట్రాలకు అలెర్ట్

అల్పపీడనాలు- ఫిబ్రవరి 19కి తర్వాత తెలుగు రాష్ట్రాలకు అలెర్ట్
February 17, 2026 12:58 AM 50 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఫిబ్రవరిలో వాతావరణంలో మార్పు వస్తుంది. ఒకవైపు ఉష్ణోగ్రతలు పెరుగుతూ వేసవి వచ్చేస్తుందని హెచ్చరిస్తుంటే.. మరోవైపు వాతావరణ శాఖ ఐఎండీ.. ఈ నెలలోనే రెండు అల్పపీడనాలు ఏర్పడే అవకాశాలున్నాయని తెలిపింది. ఇందులో మొదటి అల్పపీడనం నేడు లేదా రేపు అంటే ఫిబ్రవరి 17న దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడనుండగా, రెండోది 19వ తేదీ తర్వాత ఏర్పడే అవకాశం ఉంది. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు అనుకూలంగా ఉండటం వల్లే ఇలా అరుదైన రీతిలో అల్పపీడనాలు ఏర్పడుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.సోమవారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. అయితే ఈ మొదటి వ్యవస్థ ప్రభావం ప్రధానంగా తమిళనాడు, శ్రీలంక ప్రాంతాలపైనే ఉంటుంది. తెలుగు రాష్ట్రాలపై దీని ప్రభావం చాలా తక్కువగా ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. అయితే, ఫిబ్రవరి 19 తర్వాత ఏర్పడే రెండో వాతావరణ వ్యవస్థ మాత్రం తెలుగు రాష్ట్రాలపై ప్రభావం చూపనుంది. బంగాళాఖాతంలో ఏర్పడే ఉపరితల ఆవర్తనం బలపడి అల్పపీడనంగా మారే సూచనలు ఉన్నాయి. దీని ఫలితంగా ఫిబ్రవరి 25 నుంచి 28 మధ్య తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురవవచ్చు. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఫిబ్రవరి చివరి వారంలో దక్షిణ ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ నివేదికలు ద్వారా తెలుస్తోంది.

అకాల వర్షాల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ముఖ్యంగా కోతకు వచ్చిన పంటలు, ఆరబెట్టిన ధాన్యం తడిసిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పనిచేసేవారు, పశువుల కాపరులు చెట్ల కింద తలదాచుకోవద్దని హెచ్చరించింది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News