Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 04:48 AM

అక్రెడిటేషన్ జీఓపై అపోహలు వద్దు.. వృత్తిపర జర్నలిస్టులకు పూర్తి భరోసా

అక్రెడిటేషన్ జీఓపై అపోహలు వద్దు.. వృత్తిపర జర్నలిస్టులకు పూర్తి భరోసా

అక్రెడిటేషన్ జీఓపై అపోహలు వద్దు.. వృత్తిపర జర్నలిస్టులకు పూర్తి భరోసా
December 27, 2025 02:07 PM 67 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అక్రెడిటేషన్ మార్గదర్శకాలపై అపోహలు వద్దు – స్పష్టం చేసిన మీడియా అకాడమీ చైర్మన్

స్థానిక ప్రతినిధి హైదరాబాద్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన అక్రెడిటేషన్ మార్గదర్శకాలు వృత్తిపరమైన జర్నలిస్టులకు ఎలాంటి నష్టం చేయవని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి స్పష్టంగా ప్రకటించారు. జర్నలిస్టుల మధ్య ఏ విధమైన వివక్షత లేకుండా సంక్షేమ చర్యలు అందరికీ వర్తించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జర్నలిస్టుల సంక్షేమాన్ని మరింత మెరుగుపర్చే దిశగా ఆలోచిస్తున్నారని వెల్లడించారు. గతంలో ఉర్దూ జర్నలిస్టులపై జరిగిన వివక్ష, చిన్న పత్రికల పట్ల చూపిన నిర్లక్ష్యాన్ని తెలంగాణ హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలోనే ఈ కొత్త జీఓలో మార్పులు తీసుకొచ్చినట్లు ఆయన వివరించారు.

నూతన జీఓపై కొందరు ఉద్దేశపూర్వకంగా అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని, సంక్షేమ చర్యలు కేవలం కొందరికే వర్తిస్తాయని వక్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదని, వృత్తిపరమైన జర్నలిస్టులందరికీ ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయని స్పష్టం చేశారు.

ఈ అంశాలపై అవసరమైతే స్పష్టత కోరవచ్చని, జర్నలిస్టుల సంక్షేమంపై ముఖ్యమంత్రి, సమాచార శాఖ మంత్రితో ఎప్పుడైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. అయితే, దీనికి విరుద్ధంగా రాజకీయ ఎత్తుగడతో కొన్ని శక్తులు ఆందోళనలు సృష్టించడం అత్యంత విచారకరమని వ్యాఖ్యానించారు.

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రజాప్రభుత్వం సానుకూలంగా ఉందని, గత ప్రభుత్వాల మాదిరిగా వివక్ష చూపే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. నూతన జీఓపై పనిగట్టుకొని జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని జర్నలిస్టులకు విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News