Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లక్ష్య సాధనకు పట్టుదల అవసరం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 03:20 PM

ఆహార భద్రతకు విరుద్ధంగా వ్యవహారం… విక్రేత అరెస్ట్, నమూనాల సేకరణ

ఆహార భద్రతకు విరుద్ధంగా వ్యవహారం… విక్రేత అరెస్ట్, నమూనాల సేకరణ

ఆహార భద్రతకు విరుద్ధంగా వ్యవహారం… విక్రేత అరెస్ట్, నమూనాల సేకరణ
February 20, 2026 07:21 AM 33 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

నెక్కొండలో ఆహార భద్రతకు విరుద్ధంగా వ్యవహరించిన ఘటన వెలుగులోకి రావడంతో పోలీసులు వెంటనే చర్యలు చేపట్టారు. ప్రజలకు విక్రయించే ఐస్‌క్రీమ్‌లో అశుచికర పదార్థాలు కలిపినట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో సంబంధిత వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం రాజస్థాన్‌కు చెందిన కాలురాం పుర్బియా స్థానికంగా ఐస్‌క్రీమ్ బండి నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్న దృశ్యాలు ఒక వ్యక్తి సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పంపిణీ చేయడంతో విషయం బయటపడింది. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి మంగళవారం నిందితుడిని అరెస్ట్ చేశారు.

ఘటనపై తెలంగాణ ఆహార భద్రత శాఖ అధికారులను అప్రమత్తం చేయగా ఫుడ్ ఇన్‌స్పెక్టర్ చెపూరి కృష్ణమూర్తి ఘటనాస్థలికి చేరుకుని ఐస్‌క్రీమ్ నమూనాలను సేకరించి ప్రయోగశాలకు పంపించారు. స్థానిక పంచాయతీ సిబ్బందితో కలిసి బండిలో ఉన్న పదార్థాలను స్వాధీనం చేసుకుని పారబోయించారు.

ఈ సందర్భంగా చంద్రమోహన్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమన్నారు. ఆహార పదార్థాలు విక్రయించే వ్యాపారులు పరిశుభ్రత నిబంధనలు కచ్చితంగా పాటించాలని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు కూడా బయట కొనుగోలు చేసే ఆహార పదార్థాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

పోలీసులు నెక్కొండ ప్రాంతంలో తినుబండారాలు విక్రయించే ఇతర వ్యాపారులను స్టేషన్‌కు పిలిపించి ఆహార భద్రత, పరిశుభ్రత నిబంధనలపై ప్రత్యేకంగా హెచ్చరికలు జారీ చేశారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News