Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 01:43 AM

అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఇటలీ పత్రిక సంచలన ఆరోపణలు

అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఇటలీ పత్రిక సంచలన ఆరోపణలు

అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఇటలీ పత్రిక సంచలన ఆరోపణలు
February 12, 2026 08:47 PM 122 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

పైలట్ ఉద్దేశపూర్వకంగా ఇంధన స్విచ్ ఆఫ్ చేశాడన్న కథనం – అధికారిక నిర్ధారణ లేదు

న్యూఢిల్లీ

గత ఏడాది 250 మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఇటలీకి చెందిన ప్రముఖ దినపత్రిక ‘కొర్రియేరే దెల్లా సేరా’ సంచలన ఆరోపణలు చేసింది. పైలట్లలో ఒకరు ఇంధన స్విచ్‌లను ఉద్దేశపూర్వకంగానే ఆఫ్ చేసినట్టు తన కథనంలో పేర్కొంది.విమాన కమాండర్ సుమీత్ సభర్వాల్‌ను ప్రధాన అనుమానితుడిగా సూచించిన ఆ పత్రిక, విమానంలో స్పష్టమైన సాంకేతిక లోపాలు గుర్తించబడలేదని పేర్కొంది. పలు విమానయాన సంస్థల ప్రాథమిక నివేదికల ఆధారంగా ఈ వివరాలు వెలువరించినట్టు తెలిపింది.అయితే ఈ ఆరోపణలపై భారత అధికార వర్గాల నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ధృవీకరణ వెలువడలేదు. ప్రమాదానికి గల అసలు కారణాలపై దర్యాప్తు సంస్థలు పరిశీలన కొనసాగిస్తున్నాయి. అధికారిక తుది నివేదిక వెలువడిన తర్వాతే వాస్తవాలు పూర్తిగా వెల్లడయ్యే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఇటలీ పత్రిక ప్రచురించిన ఈ కథనం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. విమాన ప్రమాదానికి గల కారణాలపై స్పష్టత కోసం బాధిత కుటుంబాలు కూడా తుది నివేదిక కోసం ఎదురుచూస్తున్నాయి.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News