Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ కట్టే చెల్లి కోసం.. హెల్మెట్‌ ధరించండి: జిల్లా ఎస్పీ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 03:22 AM

అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఇటలీ పత్రిక సంచలన ఆరోపణలు

అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఇటలీ పత్రిక సంచలన ఆరోపణలు

అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఇటలీ పత్రిక సంచలన ఆరోపణలు
12-02-2026 126 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

పైలట్ ఉద్దేశపూర్వకంగా ఇంధన స్విచ్ ఆఫ్ చేశాడన్న కథనం – అధికారిక నిర్ధారణ లేదు

న్యూఢిల్లీ

గత ఏడాది 250 మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఇటలీకి చెందిన ప్రముఖ దినపత్రిక ‘కొర్రియేరే దెల్లా సేరా’ సంచలన ఆరోపణలు చేసింది. పైలట్లలో ఒకరు ఇంధన స్విచ్‌లను ఉద్దేశపూర్వకంగానే ఆఫ్ చేసినట్టు తన కథనంలో పేర్కొంది.విమాన కమాండర్ సుమీత్ సభర్వాల్‌ను ప్రధాన అనుమానితుడిగా సూచించిన ఆ పత్రిక, విమానంలో స్పష్టమైన సాంకేతిక లోపాలు గుర్తించబడలేదని పేర్కొంది. పలు విమానయాన సంస్థల ప్రాథమిక నివేదికల ఆధారంగా ఈ వివరాలు వెలువరించినట్టు తెలిపింది.అయితే ఈ ఆరోపణలపై భారత అధికార వర్గాల నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ధృవీకరణ వెలువడలేదు. ప్రమాదానికి గల అసలు కారణాలపై దర్యాప్తు సంస్థలు పరిశీలన కొనసాగిస్తున్నాయి. అధికారిక తుది నివేదిక వెలువడిన తర్వాతే వాస్తవాలు పూర్తిగా వెల్లడయ్యే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఇటలీ పత్రిక ప్రచురించిన ఈ కథనం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. విమాన ప్రమాదానికి గల కారణాలపై స్పష్టత కోసం బాధిత కుటుంబాలు కూడా తుది నివేదిక కోసం ఎదురుచూస్తున్నాయి.


Sthanikam

అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఇటలీ పత్రిక సంచలన ఆరోపణలు

Article Image

పైలట్ ఉద్దేశపూర్వకంగా ఇంధన స్విచ్ ఆఫ్ చేశాడన్న కథనం – అధికారిక నిర్ధారణ లేదు

న్యూఢిల్లీ

గత ఏడాది 250 మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఇటలీకి చెందిన ప్రముఖ దినపత్రిక ‘కొర్రియేరే దెల్లా సేరా’ సంచలన ఆరోపణలు చేసింది. పైలట్లలో ఒకరు ఇంధన స్విచ్‌లను ఉద్దేశపూర్వకంగానే ఆఫ్ చేసినట్టు తన కథనంలో పేర్కొంది.విమాన కమాండర్ సుమీత్ సభర్వాల్‌ను ప్రధాన అనుమానితుడిగా సూచించిన ఆ పత్రిక, విమానంలో స్పష్టమైన సాంకేతిక లోపాలు గుర్తించబడలేదని పేర్కొంది. పలు విమానయాన సంస్థల ప్రాథమిక నివేదికల ఆధారంగా ఈ వివరాలు వెలువరించినట్టు తెలిపింది.అయితే ఈ ఆరోపణలపై భారత అధికార వర్గాల నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ధృవీకరణ వెలువడలేదు. ప్రమాదానికి గల అసలు కారణాలపై దర్యాప్తు సంస్థలు పరిశీలన కొనసాగిస్తున్నాయి. అధికారిక తుది నివేదిక వెలువడిన తర్వాతే వాస్తవాలు పూర్తిగా వెల్లడయ్యే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఇటలీ పత్రిక ప్రచురించిన ఈ కథనం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. విమాన ప్రమాదానికి గల కారణాలపై స్పష్టత కోసం బాధిత కుటుంబాలు కూడా తుది నివేదిక కోసం ఎదురుచూస్తున్నాయి.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News