అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఇటలీ పత్రిక సంచలన ఆరోపణలు
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఇటలీ పత్రిక సంచలన ఆరోపణలు
Biksham
పైలట్ ఉద్దేశపూర్వకంగా ఇంధన స్విచ్ ఆఫ్ చేశాడన్న కథనం – అధికారిక నిర్ధారణ లేదు
న్యూఢిల్లీ
గత ఏడాది 250 మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఇటలీకి చెందిన ప్రముఖ దినపత్రిక ‘కొర్రియేరే దెల్లా సేరా’ సంచలన ఆరోపణలు చేసింది. పైలట్లలో ఒకరు ఇంధన స్విచ్లను ఉద్దేశపూర్వకంగానే ఆఫ్ చేసినట్టు తన కథనంలో పేర్కొంది.విమాన కమాండర్ సుమీత్ సభర్వాల్ను ప్రధాన అనుమానితుడిగా సూచించిన ఆ పత్రిక, విమానంలో స్పష్టమైన సాంకేతిక లోపాలు గుర్తించబడలేదని పేర్కొంది. పలు విమానయాన సంస్థల ప్రాథమిక నివేదికల ఆధారంగా ఈ వివరాలు వెలువరించినట్టు తెలిపింది.అయితే ఈ ఆరోపణలపై భారత అధికార వర్గాల నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ధృవీకరణ వెలువడలేదు. ప్రమాదానికి గల అసలు కారణాలపై దర్యాప్తు సంస్థలు పరిశీలన కొనసాగిస్తున్నాయి. అధికారిక తుది నివేదిక వెలువడిన తర్వాతే వాస్తవాలు పూర్తిగా వెల్లడయ్యే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఇటలీ పత్రిక ప్రచురించిన ఈ కథనం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. విమాన ప్రమాదానికి గల కారణాలపై స్పష్టత కోసం బాధిత కుటుంబాలు కూడా తుది నివేదిక కోసం ఎదురుచూస్తున్నాయి.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి