Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ సీఐ మన్మథ కుమార్‌ ఘన విజయం: జిల్లా పోలీస్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఎన్నిక “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 02:30 PM

అంగన్వాడీల డిమాండ్లు నెరవేర్చకపోతే ఉద్యమం ఉధృతం

అంగన్వాడీల డిమాండ్లు నెరవేర్చకపోతే ఉద్యమం ఉధృతం

అంగన్వాడీల డిమాండ్లు  నెరవేర్చకపోతే ఉద్యమం ఉధృతం
24-02-2026 105 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రూ.26 వేల వేతనం అమలు చేయాలి

ఆదోని: అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి. ఆదోని మున్సిపల్ ప్రధాన రహదారిపై డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో కార్యకర్తలు ఆందోళన కొనసాగించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అంగన్వాడీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనాన్ని రూ.26,000గా నిర్ణయించి వెంటనే అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న అన్ని డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

దీక్షా కార్యక్రమంలో అంగన్వాడీ అసోసియేషన్ అధ్యక్షురాలు ఈరమ్మ, కోశాధికారి గీత ప్రభావతి, రాష్ట్ర, జిల్లా నాయకులు జానకి, గౌసియా పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా గౌరవ అధ్యక్షుడు టి. వీరేష్, వర్కింగ్ అధ్యక్షుడు ఏ. విజయ్ కుమార్, సిపిఐ పట్టణ సహాయకార్యదర్శి కె. రమేష్ కుమార్, ఏఐవైఎఫ్ పట్టణ కార్యదర్శి జి. అంజి గౌడ్ హాజరై సంఘీభావం తెలిపారు.

Sthanikam

అంగన్వాడీల డిమాండ్లు నెరవేర్చకపోతే ఉద్యమం ఉధృతం

Article Image

రూ.26 వేల వేతనం అమలు చేయాలి

ఆదోని: అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి. ఆదోని మున్సిపల్ ప్రధాన రహదారిపై డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో కార్యకర్తలు ఆందోళన కొనసాగించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అంగన్వాడీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనాన్ని రూ.26,000గా నిర్ణయించి వెంటనే అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న అన్ని డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

దీక్షా కార్యక్రమంలో అంగన్వాడీ అసోసియేషన్ అధ్యక్షురాలు ఈరమ్మ, కోశాధికారి గీత ప్రభావతి, రాష్ట్ర, జిల్లా నాయకులు జానకి, గౌసియా పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా గౌరవ అధ్యక్షుడు టి. వీరేష్, వర్కింగ్ అధ్యక్షుడు ఏ. విజయ్ కుమార్, సిపిఐ పట్టణ సహాయకార్యదర్శి కె. రమేష్ కుమార్, ఏఐవైఎఫ్ పట్టణ కార్యదర్శి జి. అంజి గౌడ్ హాజరై సంఘీభావం తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News