ఆదోనిలో నూతన కమిషనర్కు జనసేన నేతల శుభాకాంక్షలు
ఆదోనిలో నూతన కమిషనర్కు జనసేన నేతల శుభాకాంక్షలు
స్థానికం బృందం
ఆదోని: ఆదోని మున్సిపాలిటీకి నూతనంగా నియమితులైన కమిషనర్ను జనసేన పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ ఇంచార్జ్ మల్లప్పన్న ఆదేశాల మేరకు జనసేన సీనియర్ నాయకుడు యం. పులి రాజు కమిషనర్ను కలిసి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా యం. పులి రాజు మాట్లాడుతూ కమిషనర్ నాయకత్వంలో పట్టణ అభివృద్ధి వేగవంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పారిశుద్ధ్యం, రోడ్ల మరమ్మతులు, తాగునీటి సరఫరా, ప్రజా సౌకర్యాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు చురుకుగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.
జనసేన పార్టీ తరఫున పట్టణాభివృద్ధికి నిర్మాణాత్మక సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. అయితే పరిపాలనా వ్యవహారాల్లో నేరుగా జోక్యం చేసుకోబోమని గౌరవపూర్వకంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్ పి.ఎస్. జయరాం, మంచాలి రాజు, వాలేకర్ విజయ్, ఉరుకుందు అంజి, వలి భాషతో పాటు ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి