Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ సీఐ మన్మథ కుమార్‌ ఘన విజయం: జిల్లా పోలీస్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఎన్నిక “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 09:47 AM

ఆదోనిలో నూతన కమిషనర్‌కు జనసేన నేతల శుభాకాంక్షలు

ఆదోనిలో నూతన కమిషనర్‌కు జనసేన నేతల శుభాకాంక్షలు

ఆదోనిలో నూతన కమిషనర్‌కు జనసేన నేతల శుభాకాంక్షలు
23-02-2026 42 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని: ఆదోని మున్సిపాలిటీకి నూతనంగా నియమితులైన కమిషనర్‌ను జనసేన పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ ఇంచార్జ్ మల్లప్పన్న ఆదేశాల మేరకు జనసేన సీనియర్ నాయకుడు యం. పులి రాజు కమిషనర్‌ను కలిసి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా యం. పులి రాజు మాట్లాడుతూ కమిషనర్ నాయకత్వంలో పట్టణ అభివృద్ధి వేగవంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పారిశుద్ధ్యం, రోడ్ల మరమ్మతులు, తాగునీటి సరఫరా, ప్రజా సౌకర్యాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు చురుకుగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.

జనసేన పార్టీ తరఫున పట్టణాభివృద్ధికి నిర్మాణాత్మక సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. అయితే పరిపాలనా వ్యవహారాల్లో నేరుగా జోక్యం చేసుకోబోమని గౌరవపూర్వకంగా తెలిపారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్ పి.ఎస్. జయరాం, మంచాలి రాజు, వాలేకర్ విజయ్, ఉరుకుందు అంజి, వలి భాషతో పాటు ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

ఆదోనిలో నూతన కమిషనర్‌కు జనసేన నేతల శుభాకాంక్షలు

Article Image

ఆదోని: ఆదోని మున్సిపాలిటీకి నూతనంగా నియమితులైన కమిషనర్‌ను జనసేన పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ ఇంచార్జ్ మల్లప్పన్న ఆదేశాల మేరకు జనసేన సీనియర్ నాయకుడు యం. పులి రాజు కమిషనర్‌ను కలిసి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా యం. పులి రాజు మాట్లాడుతూ కమిషనర్ నాయకత్వంలో పట్టణ అభివృద్ధి వేగవంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పారిశుద్ధ్యం, రోడ్ల మరమ్మతులు, తాగునీటి సరఫరా, ప్రజా సౌకర్యాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు చురుకుగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.

జనసేన పార్టీ తరఫున పట్టణాభివృద్ధికి నిర్మాణాత్మక సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. అయితే పరిపాలనా వ్యవహారాల్లో నేరుగా జోక్యం చేసుకోబోమని గౌరవపూర్వకంగా తెలిపారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్ పి.ఎస్. జయరాం, మంచాలి రాజు, వాలేకర్ విజయ్, ఉరుకుందు అంజి, వలి భాషతో పాటు ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News