Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధలో ఉన్న కుటుంబాలకు చిరుమర్తి అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 02:52 PM

అందంగా ఉన్నావ్,వ్యభిచారం చేయాలని కట్టుకున్న భర్త అత్త కోడలు పై ఒత్తిడి, వేధింపులు ,భరించలేక వివాహిత ఆత్మ హత్య

అందంగా ఉన్నావ్,వ్యభిచారం చేయాలని కట్టుకున్న భర్త అత్త కోడలు పై ఒత్తిడి, వేధింపులు ,భరించలేక వివాహిత ఆత్మ హత్య

అందంగా ఉన్నావ్,వ్యభిచారం చేయాలని కట్టుకున్న భర్త అత్త కోడలు పై ఒత్తిడి, వేధింపులు ,భరించలేక వివాహిత ఆత్మ హత్య
February 11, 2026 06:19 PM 74 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

భర్త అత్త టార్చర్ ,భరించలేక వివాహిత అంజనా భాయ్ ఆత్మహత్య.కర్ణాటక బీదర్ జిల్లా బసవ కళ్యాణ పట్టణంలో ఘటన చోటుచేసుకుంది అత్తగారింట్లో నరకం అనుభవించలేక

ఈ విషయాలను బయట ఎవరికీ చెప్పుకోలేక, అత్తగారింట్లో నరకం అనుభవించలేక అంజనాబాయి ఫిబ్రవరి 6 వ తేదీన తన భర్త ఇంట్లోనే ఉరివేసుకుని ప్రాణాలు వదిలింది. తన కూతురిని ఈ ముగ్గురే వేధించి చంపేశారని తండ్రి విజయ్ కుమార్ బసవకల్యాణ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధ్యతగా చూసుకోవాల్సిన భర్తే కాల యముడుగా మారి, అన్నీ అవ్వాల్సిన అత్తమామలే వ్యభిచార కూపంలోకి నెట్టితే ఆ ఇల్లాలు తన గోడును ఎవరితో చెప్పుకుంటుంది. సరిగ్గా ఇలాంటి ఘటనే కర్ణాటకలోని బీదర్ జిల్లాలో బసవకళ్యాణ్ పట్టంలో చోటుచేసుకుంది. అంజనాబాయ్ అనే మహిళకు ఇదే నగరానికి చెందిన శేఖర్ పాటిల్ అనే వ్యక్తితో ఏడాది క్రితం వివాహం జరిగింది. ఈ జంటకు 11 నెలల పాపజన్మించింది. కొన్నిరోజుల అనంతరం ఆమెను భర్త, అత్తమామలు వ్యభిచారం చేయాలని మానసికంగా భాధపెట్టారు. వాళ్లు చెప్పినట్లు నడుచుకోకుంటే పలు విధాలుగా వేధించారు. దీంతో మనస్తాపం చెందిన ఆమె ఆత్మహత్య చేసుకుంది.ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. బా ధితురాలు తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.

బీదర్ జిల్లాలోని బసవకల్యాణ్ శేఖర్ పాటిల్ను అంజనా బాయి 2022లో పెళ్లి చేసుకుంది. పెళ్లయిన కొన్నాళ్లు అంతా సవ్యంగానే ఉంది. శేఖర్ పానీ పూరీ వ్యాపారం చేస్తుండేవాడు. రోజూ ఇంటికొచ్చేసరికి రాత్రి 11 నుంచి 12 దాటేది. ఈ విషయంలో భార్యాభర్త మధ్య గొడవలు జరిగాయి.సాయంత్రం త్వరగా వెళ్లేసి రాత్రి 10 గంటల లోపు ఇంటికి రావాలని భర్తను అంజనా బాయి అడిగింది. అందుకు కుదరదని భర్త తెగేసి చెప్పాడు. శేఖర్ అత్త కూడా కోడలిపై ఇదే విషయంలో కస్సుబుస్సులాడింది. భర్త, అత్త కలిసి అప్పటి నుంచి అంజనాను వేధించడం మొదలుపెట్టారు.వ్యభిచారం చేయాలని భర్త, అత్త ఆమెపై తీవ్ర ఒత్తిడి చేశారు. అందంగా ఉన్నావని.. వ్యభిచారం చేసి బాగా సంపాదించొచ్చని అంజనాను భర్త, అత్త కలిసి వేధించారు. 11 నెలల పాప ఉన్న తల్లిని ఇలా సూటిపోటి మాటలతో వేధించి వ్యభిచార రొంపిలోకి దింపే ప్రయత్నం చేయడంతో అంజనా బాయి మానసిక వేదనను తట్టుకోలేక పోయింది.క్షణికావేశంలో చావే శరణ్యమని భావించి ఆత్మహత్య చేసుకుని ప్రాణం తీసుకుంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News