అధ్వాన్నంగా మున్సిపాలిటీ చెత్త డంపు యార్డ్
అధ్వాన్నంగా మున్సిపాలిటీ చెత్త డంపు యార్డ్
chintha ravi
ప్రజానీకం, రైతులకు అవస్థలు
తిరుమలగిరి స్థానికం ప్రతినిధి రవి
తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని చెత్త డంపింగ్ యార్డ్ అధ్వాన్నంగా మారి ప్రజానీకం, రైతులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. డంపింగ్ యార్డ్కు ప్రహరీ గోడ లేకపోవడంతో ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా సంక్షేమ హాస్టళ్లకు అతి సమీపంలోనే డంపు యార్డ్ ఉండటంతో విద్యార్థులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గురువారం సీపీఐ (ఎం.ఎల్) మాస్ లైన్ డివిజన్ కార్యదర్శి పేర్ల నాగయ్య డంపింగ్ యార్డ్ను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, చెత్త నుంచి వెలువడే పొగ కారణంగా పరిసర ప్రాంతాల్లోని రైతులు సుమారు 20 నుంచి 50 ఎకరాల వరకు పంట నష్టపోతున్నారని తెలిపారు. అలాగే నీలిబండ తండాకు వెళ్లే వాహనదారులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
డంపింగ్ యార్డ్ చుట్టూ వెంటనే ప్రహరీ గోడ నిర్మించాలని, చెత్త నిర్వహణకు రీసైక్లింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలని ఆయన అధికారులను డిమాండ్ చేశారు. సమస్యను నిర్లక్ష్యం చేస్తే ప్రజా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి