Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:55 AM

ఆదర్శ గ్రామాల దిశగా సర్పంచులకు శిక్షణ

ఆదర్శ గ్రామాల దిశగా సర్పంచులకు శిక్షణ

ఆదర్శ గ్రామాల దిశగా సర్పంచులకు శిక్షణ
21-02-2026 476 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భూదానపోచంపల్లి, గ్రామాలను ఆదర్శ పంచాయతీలుగా తీర్చిదిద్దాలని జిల్లా పరిషత్ సీఈఓ శోభారాణి సూచించారు. జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్ రెడ్డితో కలిసి ఆమె మాట్లాడారు.

భూదానపోచంపల్లి మండలంలోని జలాల్‌పూర్‌లో గల స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో రెండో విడతగా నిర్వహించిన నూతన సర్పంచుల శిక్షణ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. బొమ్మలరామారం, అలేరు, అడ్డగూడూరు, రామన్నపేట మండలాలకు చెందిన సర్పంచులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఆదర్శ పంచాయతీలకు ప్రభుత్వం నగదు ప్రోత్సాహకాలు అందజేస్తుందని తెలిపారు. గ్రామాల్లో తాగునీరు, రహదారులు, డ్రెయినేజీలు, పారిశుద్ధ్యం, విద్యుద్దీపాలు, వైకుంఠధామాల అభివృద్ధి, హరితహారం అమలు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పారదర్శక పాలనతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో డీఎల్పీఓ, ట్రైనింగ్ కోఆర్డినేటర్లు బి. శ్రీకాంత్‌రెడ్డి, రాములు, టీబీటీలు భాస్కర్, నవీన్‌కుమార్, మాజిద్, దినకర్, వెంకటేశ్వర్లు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఆదర్శ గ్రామాల దిశగా సర్పంచులకు శిక్షణ

Article Image

భూదానపోచంపల్లి, గ్రామాలను ఆదర్శ పంచాయతీలుగా తీర్చిదిద్దాలని జిల్లా పరిషత్ సీఈఓ శోభారాణి సూచించారు. జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్ రెడ్డితో కలిసి ఆమె మాట్లాడారు.

భూదానపోచంపల్లి మండలంలోని జలాల్‌పూర్‌లో గల స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో రెండో విడతగా నిర్వహించిన నూతన సర్పంచుల శిక్షణ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. బొమ్మలరామారం, అలేరు, అడ్డగూడూరు, రామన్నపేట మండలాలకు చెందిన సర్పంచులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఆదర్శ పంచాయతీలకు ప్రభుత్వం నగదు ప్రోత్సాహకాలు అందజేస్తుందని తెలిపారు. గ్రామాల్లో తాగునీరు, రహదారులు, డ్రెయినేజీలు, పారిశుద్ధ్యం, విద్యుద్దీపాలు, వైకుంఠధామాల అభివృద్ధి, హరితహారం అమలు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పారదర్శక పాలనతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో డీఎల్పీఓ, ట్రైనింగ్ కోఆర్డినేటర్లు బి. శ్రీకాంత్‌రెడ్డి, రాములు, టీబీటీలు భాస్కర్, నవీన్‌కుమార్, మాజిద్, దినకర్, వెంకటేశ్వర్లు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News