Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుడి బండలా మారిన గ్యాస్ బండి… క్యూలో నిల్చొని అలసిపోయిన వినియోగదారులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 10:38 AM

ఆదర్శ గ్రామాల దిశగా సర్పంచులకు శిక్షణ

ఆదర్శ గ్రామాల దిశగా సర్పంచులకు శిక్షణ

ఆదర్శ గ్రామాల దిశగా సర్పంచులకు శిక్షణ
February 21, 2026 07:58 AM 458 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భూదానపోచంపల్లి, గ్రామాలను ఆదర్శ పంచాయతీలుగా తీర్చిదిద్దాలని జిల్లా పరిషత్ సీఈఓ శోభారాణి సూచించారు. జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్ రెడ్డితో కలిసి ఆమె మాట్లాడారు.

భూదానపోచంపల్లి మండలంలోని జలాల్‌పూర్‌లో గల స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో రెండో విడతగా నిర్వహించిన నూతన సర్పంచుల శిక్షణ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. బొమ్మలరామారం, అలేరు, అడ్డగూడూరు, రామన్నపేట మండలాలకు చెందిన సర్పంచులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఆదర్శ పంచాయతీలకు ప్రభుత్వం నగదు ప్రోత్సాహకాలు అందజేస్తుందని తెలిపారు. గ్రామాల్లో తాగునీరు, రహదారులు, డ్రెయినేజీలు, పారిశుద్ధ్యం, విద్యుద్దీపాలు, వైకుంఠధామాల అభివృద్ధి, హరితహారం అమలు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పారదర్శక పాలనతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో డీఎల్పీఓ, ట్రైనింగ్ కోఆర్డినేటర్లు బి. శ్రీకాంత్‌రెడ్డి, రాములు, టీబీటీలు భాస్కర్, నవీన్‌కుమార్, మాజిద్, దినకర్, వెంకటేశ్వర్లు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News