ఆదర్శ గ్రామాల దిశగా సర్పంచులకు శిక్షణ
ఆదర్శ గ్రామాల దిశగా సర్పంచులకు శిక్షణ
Editor Desk
భూదానపోచంపల్లి, గ్రామాలను ఆదర్శ పంచాయతీలుగా తీర్చిదిద్దాలని జిల్లా పరిషత్ సీఈఓ శోభారాణి సూచించారు. జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్ రెడ్డితో కలిసి ఆమె మాట్లాడారు.
భూదానపోచంపల్లి మండలంలోని జలాల్పూర్లో గల స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో రెండో విడతగా నిర్వహించిన నూతన సర్పంచుల శిక్షణ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. బొమ్మలరామారం, అలేరు, అడ్డగూడూరు, రామన్నపేట మండలాలకు చెందిన సర్పంచులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఆదర్శ పంచాయతీలకు ప్రభుత్వం నగదు ప్రోత్సాహకాలు అందజేస్తుందని తెలిపారు. గ్రామాల్లో తాగునీరు, రహదారులు, డ్రెయినేజీలు, పారిశుద్ధ్యం, విద్యుద్దీపాలు, వైకుంఠధామాల అభివృద్ధి, హరితహారం అమలు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పారదర్శక పాలనతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో డీఎల్పీఓ, ట్రైనింగ్ కోఆర్డినేటర్లు బి. శ్రీకాంత్రెడ్డి, రాములు, టీబీటీలు భాస్కర్, నవీన్కుమార్, మాజిద్, దినకర్, వెంకటేశ్వర్లు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి