Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ధాన్యం కొనుగోలు పై సమీక్ష: రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోండి ప్రభుత్వ విప్ వేముల వీరేశం ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 22, 2026 01:32 PM

అభివృద్ధి చేస్తే రండి లేదంటే అభ్యర్థులను తప్పించండి వీరేషానికి లింగయ్య సవాల్

అభివృద్ధి చేస్తే రండి లేదంటే అభ్యర్థులను తప్పించండి వీరేషానికి లింగయ్య సవాల్

అభివృద్ధి చేస్తే రండి లేదంటే అభ్యర్థులను తప్పించండి వీరేషానికి  లింగయ్య సవాల్
February 06, 2026 12:11 PM 138 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్లగొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీలో ఎన్నికల వేడి మరింత పెరిగింది. బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు లక్ష్యంగా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చిట్యాల పట్టణంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశంపై తీవ్రస్థాయిలో సవాల్ విసిరారు.

తాను గత నాలుగున్నర సంవత్సరాల కాలంలో చిట్యాల పట్టణ అభివృద్ధికి చేసిన పనులపై బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నానని లింగయ్య స్పష్టం చేశారు. అదే విధంగా ఎమ్మెల్యే వీరేశం గెలిచిన తర్వాత రెండున్నర సంవత్సరాల్లో చేసిన అభివృద్ధిపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించారు.

చర్చకు సిద్ధమై కనకదుర్గమ్మ ఆలయానికి వచ్చి అభివృద్ధి అంశాలపై మాట్లాడితే, తాను బిఆర్ఎస్‌కు చెందిన 12 మంది మున్సిపల్ అభ్యర్థులను పోటీ నుంచి తప్పించేందుకు సిద్ధమని లింగయ్య సంచలన ప్రకటన చేశారు. అదే విధంగా, ఎమ్మెల్యే వీరేశం చర్చకు రాకుండా అభివృద్ధి చేయలేదని తేలితే, కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది అభ్యర్థులను పోటీ నుంచి తప్పించేందుకు సిద్ధమా అని ప్రశ్నించారు.

ఈ సవాలను స్వీకరిస్తే కనకదుర్గమ్మ ఆలయం వద్దకు వచ్చి అభివృద్ధిపై బహిరంగ చర్చ జరపాలని ఆయన స్పష్టం చేశారు.

ఈ వ్యాఖ్యలు చిట్యాల రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తుండగా, ఎమ్మెల్యే వీరేశం దీనిపై ఎలా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది.మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య అభివృద్ధి అంశమే ప్రధాన ఆయుధంగా మారుతుండటం గమనార్హం.


మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News