Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక అక్రమ మైనింగ్ ఆరోపణలపై అధికారుల మౌనం ఎందుకు?... హైకోర్టును ఆశ్రయించిన ఆర్టీఐ కార్యకర్త ఉబ్బని రాజు ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 01, 2026 10:46 AM

అంబేద్కర్ జయంతి సందర్భంగా విగ్రహ శుద్ధి కార్యక్రమం

అంబేద్కర్ జయంతి సందర్భంగా విగ్రహ శుద్ధి కార్యక్రమం

అంబేద్కర్ జయంతి సందర్భంగా విగ్రహ శుద్ధి కార్యక్రమం
April 13, 2026 07:29 PM 113 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భారతీయ జనతా పార్టీ భువనగిరి పట్టణ అధ్యక్షులు రత్నపురం బలరాం ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహ శుద్ధి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ జిల్లా అధ్యక్షులు ఉట్కూరి అశోక్ గౌడ్ మాట్లాడుతూ, అంబేద్కర్ జయంతి సందర్భంగా విగ్రహాన్ని పాలు, నీళ్లతో శుభ్రపరిచి పూలమాలలు వేసి నివాళులర్పించినట్లు తెలిపారు. అనంతరం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగ పీఠికను చదివి, ఆయన దేశానికి అందించిన సేవలను స్మరించారు. రాజ్యాంగాన్ని రచించి పేద ప్రజల జీవనాల్లో వెలుగులు నింపిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు జైనపాల్ శ్యామ్ సుందర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి చందా మహేందర్ గుప్తా, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు పట్నం కపిల్, కార్యాలయ కార్యదర్శి మంగు నర్సింహా రావు, జిల్లా మీడియా కన్వీనర్ ఆకుతోట రామకృష్ణ, ఎస్సీ మోర్చా నాయకులు కనుకుంట్ల రమేష్, ఈరబెల్లి నాగరాజు, కొలకొండ రాము, మామిడోజు పవన్ కళ్యాణ్, కోల సుధాకర్, యాట వెంకటేష్, మల్లికార్జున్, ఎండీ మహమూద్, శ్రవణ్, వాసా నర్సింగ్, రాజేష్, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.

కార్యక్రమం సందర్భంగా నాయకులు అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేస్తామని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News