Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 03:42 AM

ఆత్మకూరు మండలంలో ఉలిక్కిపడ్డ ప్రజలు – గ్రామాల వైపు పెద్దపులి సంచారం

ఆత్మకూరు మండలంలో ఉలిక్కిపడ్డ ప్రజలు – గ్రామాల వైపు పెద్దపులి సంచారం

ఆత్మకూరు మండలంలో ఉలిక్కిపడ్డ ప్రజలు – గ్రామాల వైపు పెద్దపులి సంచారం
February 05, 2026 01:11 AM 636 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆత్మకూరు మండలంలో పెద్దపులి సంచారం – పల్లెపహాడ్, పారుపల్లి గ్రామాల్లో భయాందోళన

ఆత్మకూరు మండలంలో ఒక్కసారిగా కలకలం రేగింది. అడవిని దాటి పెద్దపులి గ్రామాల వైపు చేరినట్లు అటవీ శాఖ అధికారులు ప్రకటించడంతో పల్లెపహాడ్, పారుపల్లి గ్రామాల్లో భయాందోళన నెలకొంది. సుమారు మూడు వందల కిలోల బరువున్న పెద్దపులి సంచరిస్తోందన్న సమాచారం ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది.పొలాలు, వ్యవసాయ బావులు, అటవీ సరిహద్దుల వద్ద పెద్దపులి కదలికలు ఉన్నట్లు గుర్తించిన అధికారులు అప్రమత్తమయ్యారు. రైతులు, గ్రామస్తులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఒంటరిగా పొలాల వైపు వెళ్లవద్దని, పశువులను బయట వదలకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.గ్రామాల్లో అవసరం లేని సంచారం మానుకోవాలని, పిల్లలను బయటకు పంపవద్దని అటవీ శాఖ స్పష్టం చేసింది. పెద్దపులి ఆనవాళ్లు కనిపించినా, దర్శనమిచ్చినా వెంటనే అధికారులకు తెలియజేయాలని కోరింది. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు.

ఆత్మకూరు మండలంలో పెద్దపులి సంచారం… ప్రజల్లో ఆందోళన… గ్రామాలపై ముప్పు మేఘం కమ్ముకున్న వేళ అప్రమత్తతే రక్షణగా మారింది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News