Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 03:52 AM

ఆస్తుల వివరాలు ఇవ్వకపోతే జీతాలు లేవు!

ఆస్తుల వివరాలు ఇవ్వకపోతే జీతాలు లేవు!

ఆస్తుల వివరాలు ఇవ్వకపోతే జీతాలు లేవు!
February 03, 2026 05:41 AM 147 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

68 వేల మంది ఉద్యోగులపై యోగి సర్కార్ సంచలన చర్య

లక్నో:

ఉత్తరప్రదేశ్‌ను అవినీతి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ తమ ఆస్తుల వివరాలను తప్పనిసరిగా సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది.ఈ ఆదేశాల మేరకు పలువురు ఉద్యోగులు ఇప్పటికే ఆస్తి వివరాలు అందించగా, 68 వేల మంది ఉద్యోగులు మాత్రం ప్రభుత్వ సూచనలను పట్టించుకోలేదు. దీనిపై సీరియస్ అయిన యోగి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.ఆస్తుల వివరాలు సమర్పించని సుమారు 68 వేల మంది ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సంబంధిత ఉద్యోగులు తమ ఆస్తుల వివరాలను ప్రభుత్వానికి అందించే వరకు వారికి జీతాలు చెల్లించబోమని స్పష్టం చేసింది.అవినీతికి చెక్ పెట్టాలనే లక్ష్యంతో తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News