Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధలో ఉన్న కుటుంబాలకు చిరుమర్తి అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 02:54 PM

ఆస్తుల వివరాలు ఇవ్వకపోతే జీతాలు లేవు!

ఆస్తుల వివరాలు ఇవ్వకపోతే జీతాలు లేవు!

ఆస్తుల వివరాలు ఇవ్వకపోతే జీతాలు లేవు!
February 03, 2026 05:41 AM 143 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

68 వేల మంది ఉద్యోగులపై యోగి సర్కార్ సంచలన చర్య

లక్నో:

ఉత్తరప్రదేశ్‌ను అవినీతి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ తమ ఆస్తుల వివరాలను తప్పనిసరిగా సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది.ఈ ఆదేశాల మేరకు పలువురు ఉద్యోగులు ఇప్పటికే ఆస్తి వివరాలు అందించగా, 68 వేల మంది ఉద్యోగులు మాత్రం ప్రభుత్వ సూచనలను పట్టించుకోలేదు. దీనిపై సీరియస్ అయిన యోగి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.ఆస్తుల వివరాలు సమర్పించని సుమారు 68 వేల మంది ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సంబంధిత ఉద్యోగులు తమ ఆస్తుల వివరాలను ప్రభుత్వానికి అందించే వరకు వారికి జీతాలు చెల్లించబోమని స్పష్టం చేసింది.అవినీతికి చెక్ పెట్టాలనే లక్ష్యంతో తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News