ఆస్తుల వివరాలు ఇవ్వకపోతే జీతాలు లేవు!
ఆస్తుల వివరాలు ఇవ్వకపోతే జీతాలు లేవు!
Editor Desk
68 వేల మంది ఉద్యోగులపై యోగి సర్కార్ సంచలన చర్య
లక్నో:
ఉత్తరప్రదేశ్ను అవినీతి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ తమ ఆస్తుల వివరాలను తప్పనిసరిగా సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది.ఈ ఆదేశాల మేరకు పలువురు ఉద్యోగులు ఇప్పటికే ఆస్తి వివరాలు అందించగా, 68 వేల మంది ఉద్యోగులు మాత్రం ప్రభుత్వ సూచనలను పట్టించుకోలేదు. దీనిపై సీరియస్ అయిన యోగి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.ఆస్తుల వివరాలు సమర్పించని సుమారు 68 వేల మంది ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సంబంధిత ఉద్యోగులు తమ ఆస్తుల వివరాలను ప్రభుత్వానికి అందించే వరకు వారికి జీతాలు చెల్లించబోమని స్పష్టం చేసింది.అవినీతికి చెక్ పెట్టాలనే లక్ష్యంతో తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి