Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుడి బండలా మారిన గ్యాస్ బండి… క్యూలో నిల్చొని అలసిపోయిన వినియోగదారులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 10:38 AM

ఆదోనిలో సీపీఐ ఆధ్వర్యంలో ఉత్సాహభరిత బైక్ ర్యాలీ

ఆదోనిలో సీపీఐ ఆధ్వర్యంలో ఉత్సాహభరిత బైక్ ర్యాలీ

ఆదోనిలో సీపీఐ ఆధ్వర్యంలో ఉత్సాహభరిత బైక్ ర్యాలీ
January 14, 2026 08:31 AM 14 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సీపీఐ శతాబ్ది సభను జయప్రదం చేయాలి

ఆదోని, స్థానికం ప్రధాన ప్రతినిధి

భారత కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ నెల 18న ఖమ్మం నగరంలో నిర్వహించనున్న మహా బహిరంగ సభను, అలాగే జనవరి 16న ఆదోనిలో జరగనున్న పబ్లిక్ మీటింగ్‌ను విజయవంతం చేయాలని పిలుపునిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో ఆదోనిలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీకి సీపీఐ మండల కార్యదర్శి కల్లుబావి రాజు, పట్టణ సహాయ కార్యదర్శి యు.లక్ష్మీనారాయణ, ఏఐవైఎఫ్ పట్టణ కార్యదర్శి అంజిత్ గౌడ్ నాయకత్వం వహించారు.సీపీఐ సీనియర్ నాయకులు కే.అజయ్ బాబు, రైతు సంఘం నాయకులు బాసాపురం గోపాల్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. బుడ్డేకల్‌లోని సీపీఐ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ గుల్షన్ షా దర్గా, హవన్నపేట, తిక్క స్వామి దర్గా, పోలీస్ కంట్రోల్ రూమ్, భీమాస్ సర్కిల్, శ్రీనివాస భవన్, ఏరియా హాస్పిటల్ రోడ్డుల మీదుగా సాగి తిరిగి సీపీఐ కార్యాలయం వద్ద ముగిసింది.

ఈ సందర్భంగా సీపీఐ సీనియర్ నాయకుడు కే.అజయ్ బాబు మాట్లాడుతూ, వందేళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్టు పార్టీ దేశంలోని కార్మికులు, రైతులు, పేదలు, అణగారిన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడుతూ ప్రజల పక్షాన నిలిచిందన్నారు. శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఖమ్మంలో జరగనున్న మహా బహిరంగ సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఘన విజయం సాధించాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ బైక్ ర్యాలీలో సీపీఐ డీహెచ్‌పీఎస్ జిల్లా నాయకులు ఏ.విజయ్ కుమారస్వామి, నాగరాజు, రవి, వడ్డే రాము, పులి రాజు, గిడ్డయ్య, వంశీతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని శతాబ్ది ఉత్సవాలకు మద్దతు ప్రకటించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News