PRINT TIME: May 26, 2026 05:57 PM
ఆదోనిలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
ఆదోనిలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
December 31, 2025 03:17 PM
210 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
ఆదోని స్థానిక ప్రతినిధి
ఆదోని నియోజకవర్గంలో మా వార్డు ఫరీద్ సాహెబ్ స్ట్రీట్, చిన్న మార్కెట్ ప్రాంతాలకు చెందిన బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. ఆదోని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఉమాపతి నాయుడు చేతుల మీదుగా ఈ సహాయం అందజేశారు.
ఆదోని టీడీపీ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు చేసిన కృషి ఫలితంగా ఒకరికి రూ.1.57 లక్షలు, మరో వ్యక్తికి రూ.18 వేల సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరైంది. ఆపదలో ఉన్న వారికి ప్రభుత్వ సహాయం వేగంగా అందేలా పార్టీ నాయకత్వం నిరంతరం కృషి చేస్తోందని ఈ సందర్భంగా తెలిపారు.
ప్రజల సమస్యలను ప్రభుత్వానికి చేరవేసి, అర్హులైన వారికి సహాయం అందించడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా బాధిత కుటుంబాలకు కొంతమేర ఊరట కలిగిందని స్థానికులు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి