Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 24, 2026 03:17 AM

ఆదోనిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ

ఆదోనిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ

ఆదోనిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ
December 31, 2025 02:24 PM 102 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం
ఆదోని స్థానికం ప్రతినిధి

ఆదోని పట్టణంలో బుధవారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు, ఆదోని టీడీపీ ఇన్‌చార్జ్ మీనాక్షి నాయుడు సూచనలతో, టీడీపీ సీనియర్ నాయకుడు ఉమాపతి నాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఉదయం ఆరు గంటల నుంచే ఎస్కేడీ కాలనీ జీరో రోడ్డు, వెంకన్నపేట, కాంతి నగర్ తదితర ప్రాంతాల్లో నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ వెళ్లి పింఛన్లను పంపిణీ చేశారు. డిసెంబర్ నెలలో నియోజకవర్గానికి 29 కొత్త పింఛన్లు మంజూరైనట్లు వెల్లడించారు. కిడ్నీ డయాలసిస్‌తో బాధపడుతున్న నలుగురికి ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున పింఛన్ అందినట్లు తెలిపారు.

కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం సంక్షేమ పథకాలు మరింత విస్తృతంగా అమలవుతాయని, అర్హులైన ప్రతి ఒక్కరికీ పార్టీలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమం అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని సంక్షేమ కార్యక్రమాలను నేలస్థాయిలో అమలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, వార్డు నాయకులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News