Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 01:42 AM

ఆదోనిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ

ఆదోనిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ

ఆదోనిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ
December 31, 2025 02:24 PM 121 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
ఆదోని స్థానికం ప్రతినిధి

ఆదోని పట్టణంలో బుధవారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు, ఆదోని టీడీపీ ఇన్‌చార్జ్ మీనాక్షి నాయుడు సూచనలతో, టీడీపీ సీనియర్ నాయకుడు ఉమాపతి నాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఉదయం ఆరు గంటల నుంచే ఎస్కేడీ కాలనీ జీరో రోడ్డు, వెంకన్నపేట, కాంతి నగర్ తదితర ప్రాంతాల్లో నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ వెళ్లి పింఛన్లను పంపిణీ చేశారు. డిసెంబర్ నెలలో నియోజకవర్గానికి 29 కొత్త పింఛన్లు మంజూరైనట్లు వెల్లడించారు. కిడ్నీ డయాలసిస్‌తో బాధపడుతున్న నలుగురికి ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున పింఛన్ అందినట్లు తెలిపారు.

కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం సంక్షేమ పథకాలు మరింత విస్తృతంగా అమలవుతాయని, అర్హులైన ప్రతి ఒక్కరికీ పార్టీలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమం అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని సంక్షేమ కార్యక్రమాలను నేలస్థాయిలో అమలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, వార్డు నాయకులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News