Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:57 PM

ఆదోనిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ

ఆదోనిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ

ఆదోనిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ
December 31, 2025 02:24 PM 114 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
ఆదోని స్థానికం ప్రతినిధి

ఆదోని పట్టణంలో బుధవారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు, ఆదోని టీడీపీ ఇన్‌చార్జ్ మీనాక్షి నాయుడు సూచనలతో, టీడీపీ సీనియర్ నాయకుడు ఉమాపతి నాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఉదయం ఆరు గంటల నుంచే ఎస్కేడీ కాలనీ జీరో రోడ్డు, వెంకన్నపేట, కాంతి నగర్ తదితర ప్రాంతాల్లో నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ వెళ్లి పింఛన్లను పంపిణీ చేశారు. డిసెంబర్ నెలలో నియోజకవర్గానికి 29 కొత్త పింఛన్లు మంజూరైనట్లు వెల్లడించారు. కిడ్నీ డయాలసిస్‌తో బాధపడుతున్న నలుగురికి ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున పింఛన్ అందినట్లు తెలిపారు.

కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం సంక్షేమ పథకాలు మరింత విస్తృతంగా అమలవుతాయని, అర్హులైన ప్రతి ఒక్కరికీ పార్టీలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమం అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని సంక్షేమ కార్యక్రమాలను నేలస్థాయిలో అమలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, వార్డు నాయకులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News