స్థానికం ప్రతినిధి కొండ మల్లేష్ గౌడ్
నాగారం గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో 95 ఏళ్ల రామచంద్రారెడ్డి విజయం సాధించి రాజకీయ వర్గాల్లో విశేష చర్చకు కారణమవుతున్నారు. వందేళ్ల వయసుకు చేరువలో ఉన్న ఆయన పోటీలో నిలబడటం మాత్రమే కాకుండా మెజారిటీతో గెలవడం గ్రామస్థాయిలో అరుదైన ఘటనగా భావిస్తున్నారు.
మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తండ్రి అయిన రామచంద్రారెడ్డి, ఎన్నికల ఫలితాల అనంతరం స్పందిస్తూ గ్రామాభివృద్ధికే శేష జీవితాన్ని అంకితం చేస్తానని వెల్లడించారు. తనపై విశ్వాసం పెట్టి గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
యువతతో సమానంగా ప్రచారం నిర్వహించిన ఆయన గెలుపు గ్రామంలో చరిత్రాత్మక విజయంగా నిలిచింది. సర్పంచ్ పదవిని చేపట్టనున్న రామచంద్రారెడ్డితో గ్రామ ప్రజలు అభివృద్ధి పనులు మరింత వేగంగా సాగుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి