6లోగా అప్లై చేసుకోండి – జర్నలిస్టులకు అక్రెడిటేషన్ గడువు
6లోగా అప్లై చేసుకోండి – జర్నలిస్టులకు అక్రెడిటేషన్ గడువు
Editor Desk
హైదరాబాద్, ప్రతినిధి:
రాష్ట్రంలోని జర్నలిస్టులు అక్రెడిటేషన్ కార్డుల కోసం ఈ నెల 6వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఐ అండ్ పీఆర్ స్పెషల్ కమిషనర్ ప్రియాంక సూచించారు. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో ఆమె పలు వివరాలు వెల్లడించారు.
జర్నలిస్టులు తమ యాజమాన్యాల నుంచి పొందిన సిఫార్సు లేఖతో పాటు అవసరమైన అర్హత పత్రాలను జతచేసి అప్లికేషన్ను పూర్తి చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని తెలిపారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం అర్హులైన వారికే అక్రెడిటేషన్ కార్డులు మంజూరు చేయనున్నట్లు స్పష్టం చేశారు.
ఇప్పటికే రాష్ట్ర అక్రెడిటేషన్ కమిటీ రెండు సార్లు సమావేశమై జీఓ అమలు, విధి విధానాలపై చర్చించిందని, అందరికీ సమాన అవకాశాలు కల్పించే దిశగా ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. ఇప్పటికే వచ్చిన దరఖాస్తులను సమీక్షిస్తూ, అర్హత ప్రమాణాలు పూర్తి చేసిన జర్నలిస్టులకు కార్డులు జారీ చేసే చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి