Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హోమియో ఆయుష్ డే సందర్భంగా యోగ అవగాహన కార్యక్రమం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 01:18 PM

60 సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థుల సువర్ణ సమ్మేళనం

60 సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థుల సువర్ణ సమ్మేళనం

60 సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థుల సువర్ణ సమ్మేళనం
February 04, 2026 06:02 PM 191 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హుజూర్‌నగర్, ఫిబ్రవరి 4:

1963–64 హెచ్‌ఎస్సీ బ్యాచ్‌కు చెందిన హుజూర్‌నగర్ జడ్పీ హైస్కూల్ పూర్వ విద్యార్థులు 60 ఏళ్ల విరామం తర్వాత కలుసుకుని సువర్ణ సమ్మేళనాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. బుధవారం కోట లక్ష్మీనరసింహారావు తోటలో జరిగిన ఈ కార్యక్రమం ఆత్మీయత, స్మృతులు, ఆనందోత్సవాల మధ్య అపూర్వంగా సాగింది.

అమెరికాలో స్థిరపడి అనేక విజయాలు సాధించి, హుజూర్‌నగర్‌కు కీర్తి ప్రతిష్ఠలు తీసుకొచ్చి ఇటీవల స్వదేశానికి వచ్చిన కన్నెగుండ్ల రామ్ నరసయ్య శుభ సందర్భంగా ఈ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు. పూర్వ విద్యార్థులు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుని, పాత జ్ఞాపకాలను తలచుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు.

స్నేహితుల బాగోగులు తెలుసుకుంటూ, జ్ఞాపికగా సమూహ చిత్రాలు తీసుకుని పరస్పరం సన్మానాలు నిర్వహించారు. విద్యార్థి దశలోని అనుభవాలు, గురువుల జ్ఞాపకాలు, జీవిత ప్రయాణాల్లో ఎదురైన మలుపులు ఈ సమ్మేళనంలో చర్చకు వచ్చాయి. ఆరు దశాబ్దాల తర్వాత కూడా స్నేహ బంధాలు చెరిగిపోకుండా నిలిచిన తీరు అందరినీ కదిలించింది.

ఈ కార్యక్రమంలో ముత్తినేని వెంకటేశ్వర్లు, వేముల వెంకటేశ్వర్లు, ఒక్కవంతుల కోటేశ్వరరావు, కన్నెగుండ్ల రామ్ నరసయ్య, ఎంబీ దేవదానం, డేవిడ్ రాజ, అలుగుబెల్లి లక్ష్మారెడ్డి, అలుగుబెల్లి కృష్ణారెడ్డి, కోట సూర్యప్రకాశవ, ఆకుమడుపుల హనుమంతు, కుక్కడపు కాశయ్య, కర్నాటి రామయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News