Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 03:38 AM

5 నెలల ఫౌండేషన్ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం

5 నెలల ఫౌండేషన్ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం

5 నెలల ఫౌండేషన్ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం
February 03, 2026 05:22 PM 97 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ – జిల్లా ఎస్సి స్టడీ సర్కిల్ డైరెక్టర్ పి. నవీన్ కుమార్

యాదాద్రి-భువనగిరి, ఫిబ్రవరి 03 :

తెలంగాణ రాష్ట్ర ఎస్సి స్టడీ సర్కిల్స్ ద్వారా నిర్వహించనున్న 5 నెలల ఫౌండేషన్ కోర్సు కు సంబంధించి ఉచిత రెసిడెన్షియల్ మరియు పోటీ పరీక్షల శిక్షణ కొరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎస్సి స్టడీ సర్కిల్ డైరెక్టర్ పి. నవీన్ కుమార్ తెలిపారు.

రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు బ్యాంకింగ్, ఆర్‌ఆర్‌బి, ఎస్సెస్సీ వంటి పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని యాదాద్రి–భువనగిరి జిల్లాకు చెందిన ఆసక్తి గల అభ్యర్థులు వినియోగించుకోవాలని సూచించారు.

ఎస్సి, ఎస్టీ, బిసి (బిసి-ఇ), మైనారిటీ, పిడబ్ల్యూడి వర్గాలకు చెందిన అభ్యర్థులు

ఆన్‌లైన్‌లో http://tsstudycircle.co.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

స్టడీ సర్కిల్‌లో ప్రవేశాలు పోటీ పరీక్ష నిర్వహించి మెరిట్ ఆధారంగా ఎంపిక చేయబడతాయని స్పష్టం చేశారు.

దరఖాస్తుల ఆఖరి తేదీ : 22-02-2026.

ప్రవేశ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు ఫిబ్రవరి 25 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని,

మార్చి 1, 2026 (ఆదివారం) నాడు ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంటల వరకు

నల్లగొండలోని నాగార్జున డిగ్రీ కళాశాలలో పోటీ పరీక్ష జరుగుతుందని తెలిపారు.

డిగ్రీ పరీక్ష ఉత్తీర్ణులై, సంవత్సరానికి రూ.3 లక్షల లోపు కుటుంబ ఆదాయం కలిగిన అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు.

దరఖాస్తు చేసుకునే సమయంలో అభ్యర్థులు కింది పత్రాలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.

కుల ధృవీకరణ పత్రం

ఏప్రిల్ 1, 2025 తరువాత తీసిన ఆదాయం సర్టిఫికెట్

డిగ్రీ సర్టిఫికెట్

పదో తరగతి సర్టిఫికెట్ (వయస్సు నిర్ధారణకు)

ఆధార్ కార్డు

పాస్‌పోర్ట్ సైజు ఫోటో, సంతకం

అంగవైకల్యం సర్టిఫికెట్ (వర్తించేవారికి మాత్రమే)

గమనిక : గతంలో స్టడీ సర్కిల్స్‌లో 5 నెలల కోచింగ్ పొందినవారు లేదా సివిల్ సర్వీసెస్ స్టేట్ స్టడీ సర్కిల్‌లో శిక్షణ పొందిన వారు అర్హులు కాదని తెలిపారు.

ఇతర వివరాలకు

9396621492 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News