26వ వార్డులో టిఆర్ఎస్ అభ్యర్థిని కోలా సైదమ్మ శ్రీనివాస్ గౌడ్కు ప్రజల మద్దతు
26వ వార్డులో టిఆర్ఎస్ అభ్యర్థిని కోలా సైదమ్మ శ్రీనివాస్ గౌడ్కు ప్రజల మద్దతు
స్థానికం బృందం
హుజూర్నగర్, ఫిబ్రవరి 4:
హుజూర్నగర్ మున్సిపాలిటీలోని 26వ వార్డు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని కోలా సైదమ్మ శ్రీనివాస్ గౌడ్ విజయాన్ని కాంక్షిస్తూ బుధవారం ఘనంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. హుజూర్నగర్ పట్టణంలోని 26వ వార్డులో ఉన్న అభయ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భారీ ర్యాలీతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.ర్యాలీ సందర్భంగా వార్డు వీధుల్లో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని టిఆర్ఎస్ పార్టీకి తమ మద్దతును ప్రకటించారు. ఈ ఎన్నికల్లో 26వ వార్డులో టిఆర్ఎస్ పార్టీయే గెలుపొందుతుందని ప్రజలు ముక్తకంఠంతో అభిప్రాయం వ్యక్తం చేస్తూ అభ్యర్థికి హర్షాతిరేకాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కోలా శ్రీనివాస్ గౌడ్, తొడ నరసింహారావు, బెక్కం లింగయ్య, వట్టికూటి జంగమయ్య, ఏనుగుల వీరభద్రం, వీర్ల వీరేందర్ తదితర నాయకులు పాల్గొని ప్రజలనుద్దేశించి మాట్లాడారు. వార్డు అభివృద్ధికి టిఆర్ఎస్ పార్టీ చేపట్టిన కార్యక్రమాలను వివరించి, మరోసారి అవకాశం ఇవ్వాలని కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి