Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఆకుల ఇంద్రసేనారెడ్డి దంపతులకు రాఖీ కట్టిన సుశీలమ్మ ఫౌండేషన్ ప్రతినిధి మౌనిక అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 04:30 PM

26వ వార్డులో టిఆర్ఎస్ అభ్యర్థిని కోలా సైదమ్మ శ్రీనివాస్ గౌడ్‌కు ప్రజల మద్దతు

26వ వార్డులో టిఆర్ఎస్ అభ్యర్థిని కోలా సైదమ్మ శ్రీనివాస్ గౌడ్‌కు ప్రజల మద్దతు

26వ వార్డులో టిఆర్ఎస్ అభ్యర్థిని కోలా సైదమ్మ శ్రీనివాస్ గౌడ్‌కు ప్రజల మద్దతు
04-02-2026 28 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హుజూర్నగర్, ఫిబ్రవరి 4:

హుజూర్నగర్ మున్సిపాలిటీలోని 26వ వార్డు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని కోలా సైదమ్మ శ్రీనివాస్ గౌడ్ విజయాన్ని కాంక్షిస్తూ బుధవారం ఘనంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. హుజూర్నగర్ పట్టణంలోని 26వ వార్డులో ఉన్న అభయ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భారీ ర్యాలీతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.ర్యాలీ సందర్భంగా వార్డు వీధుల్లో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని టిఆర్ఎస్ పార్టీకి తమ మద్దతును ప్రకటించారు. ఈ ఎన్నికల్లో 26వ వార్డులో టిఆర్ఎస్ పార్టీయే గెలుపొందుతుందని ప్రజలు ముక్తకంఠంతో అభిప్రాయం వ్యక్తం చేస్తూ అభ్యర్థికి హర్షాతిరేకాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కోలా శ్రీనివాస్ గౌడ్, తొడ నరసింహారావు, బెక్కం లింగయ్య, వట్టికూటి జంగమయ్య, ఏనుగుల వీరభద్రం, వీర్ల వీరేందర్ తదితర నాయకులు పాల్గొని ప్రజలనుద్దేశించి మాట్లాడారు. వార్డు అభివృద్ధికి టిఆర్ఎస్ పార్టీ చేపట్టిన కార్యక్రమాలను వివరించి, మరోసారి అవకాశం ఇవ్వాలని కోరారు.

Sthanikam

26వ వార్డులో టిఆర్ఎస్ అభ్యర్థిని కోలా సైదమ్మ శ్రీనివాస్ గౌడ్‌కు ప్రజల మద్దతు

Article Image

హుజూర్నగర్, ఫిబ్రవరి 4:

హుజూర్నగర్ మున్సిపాలిటీలోని 26వ వార్డు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని కోలా సైదమ్మ శ్రీనివాస్ గౌడ్ విజయాన్ని కాంక్షిస్తూ బుధవారం ఘనంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. హుజూర్నగర్ పట్టణంలోని 26వ వార్డులో ఉన్న అభయ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భారీ ర్యాలీతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.ర్యాలీ సందర్భంగా వార్డు వీధుల్లో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని టిఆర్ఎస్ పార్టీకి తమ మద్దతును ప్రకటించారు. ఈ ఎన్నికల్లో 26వ వార్డులో టిఆర్ఎస్ పార్టీయే గెలుపొందుతుందని ప్రజలు ముక్తకంఠంతో అభిప్రాయం వ్యక్తం చేస్తూ అభ్యర్థికి హర్షాతిరేకాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కోలా శ్రీనివాస్ గౌడ్, తొడ నరసింహారావు, బెక్కం లింగయ్య, వట్టికూటి జంగమయ్య, ఏనుగుల వీరభద్రం, వీర్ల వీరేందర్ తదితర నాయకులు పాల్గొని ప్రజలనుద్దేశించి మాట్లాడారు. వార్డు అభివృద్ధికి టిఆర్ఎస్ పార్టీ చేపట్టిన కార్యక్రమాలను వివరించి, మరోసారి అవకాశం ఇవ్వాలని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News