Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 24, 2026 02:06 AM

23 ఏళ్లకే సివిల్ జడ్జిగా ఎంపికైన గిరిజన యువతి – స్ఫూర్తిదాయకమైన శ్రీపతి ప్రయాణం

23 ఏళ్లకే సివిల్ జడ్జిగా ఎంపికైన గిరిజన యువతి – స్ఫూర్తిదాయకమైన శ్రీపతి ప్రయాణం

23 ఏళ్లకే సివిల్ జడ్జిగా ఎంపికైన గిరిజన యువతి – స్ఫూర్తిదాయకమైన శ్రీపతి ప్రయాణం
January 18, 2026 09:50 AM 216 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sangareddy & Manoor
Sthanikam District Staff Reporter krishna

ఉమ్మడి రాష్ట్రం స్థానికం ప్రతినిధి :రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఓ గిరిజన యువతి సివిల్ జడ్జిగా ఎంపికై చరిత్ర సృష్టించింది. కేవలం 23 ఏళ్ల వయసులోనే సివిల్ జడ్జిగా ఎంపికైన శ్రీపతి అసాధారణ ధైర్యసాహసాలకు ప్రతీకగా నిలిచింది. ఆమె సాధించిన ఈ గొప్ప విజయాన్ని ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ స్వయంగా అభినందిస్తూ ప్రశంసలు కురిపించారు.శ్రీపతి జీవిత ప్రయాణం సులభమైనది కాదు. చదువు కోసం, ఉద్యోగ లక్ష్యం కోసం ఎన్నో ఆర్థిక, సామాజిక అడ్డంకులను ఎదుర్కొని ముందుకు సాగింది. ముఖ్యంగా సివిల్ జడ్జి పరీక్షకు ముందు ఆమె ఎదుర్కొన్న పరిస్థితులు హృదయాన్ని తాకేలా ఉన్నాయి.పరీక్షకు కేవలం రెండు రోజుల ముందు శ్రీపతి ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ సమయంలో వైద్యులు విశ్రాంతి తప్పనిసరి అని, పరీక్ష రాయడం ప్రమాదకరమని సూచించారు. అయినా తన జీవిత లక్ష్యాన్ని వదులుకోవద్దని నిర్ణయించుకున్న ఆమె అపార ధైర్యంతో ముందడుగు వేసింది. రెండు రోజుల పసికందును వెంట పెట్టుకొని తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన సివిల్ జడ్జి పరీక్షకు హాజరైంది.తల్లి బాధ్యతలతో పాటు పరీక్ష ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కొని, చివరికి ఉద్యోగానికి ఎంపికై అందరికీ స్ఫూర్తిగా నిలిచింది. గిరిజన వర్గానికి చెందిన యువతికి ఇది కేవలం వ్యక్తిగత విజయం మాత్రమే కాదు, సమాజంలోని అనేక మందికి ఆశాజ్యోతి కూడా.శ్రీపతి విజయం కష్టం ఎంత ఉన్నా ధైర్యం, సంకల్పం ఉంటే ఏ లక్ష్యమైనా సాధ్యమేనని మరోసారి నిరూపించింది.

మీ స్పందన? 4 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News