PRINT TIME: February 24, 2026 01:55 AM
12వ వార్డులో మెండే సుజాత సైదులు గెలుపు ఖాయం : కన్నెబోయిన బలరామ్ యాదవ్
12వ వార్డులో మెండే సుజాత సైదులు గెలుపు ఖాయం : కన్నెబోయిన బలరామ్ యాదవ్
February 04, 2026 11:14 AM
98 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం
చిట్యాల :
చిట్యాల మున్సిపాలిటీలో జరుగుతున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఓటర్లకు గుర్తు చేస్తూ, స్థానిక మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య చిట్యాలను కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన విషయం అక్షరాల నిజమని నాయకులు తెలిపారు.
ఈ సందర్భంగా 12వ వార్డు ఇంచార్జ్ కన్నెబోయిన బలరామ్ యాదవ్ మాట్లాడుతూ, ఓటర్లు ఒక్కసారి ఆలోచించి కారు గుర్తుకే ఓటు వేయాలని, 12వ వార్డులో టీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి మెండే సుజాత సైదులును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
12వ వార్డులో ఇంటింటా ప్రచారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆవుల ఆనంద్, బెల్లి తిరుమలేశ్, వెంకన్న, జాల ప్రకాష్, పున్న వెంకటేష్, జటాంగి వెంకన్న, సాగర్ల పవన్ కుమార్, కన్నెబోయిన వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి