Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:59 AM

యువతకు ఉద్యోగాలతో పాటు సాధికారత రోజ్‌గార్ మేళాతో కేంద్రం భారీ ఉపాధి కల్పన

యువతకు ఉద్యోగాలతో పాటు సాధికారత రోజ్‌గార్ మేళాతో కేంద్రం భారీ ఉపాధి కల్పన

యువతకు ఉద్యోగాలతో పాటు సాధికారత రోజ్‌గార్ మేళాతో కేంద్రం భారీ ఉపాధి కల్పన
23-05-2026 31 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సికింద్రాబాద్‌లో 19వ విడత కార్యక్రమం.

218 మందికి నియామక పత్రాలు అందజేసిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌,: నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలతో పాటు సాధికారత కల్పించడమే ‘రోజ్‌గార్ మేళా’ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి . కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 47 ప్రాంతాల్లో నిర్వహించిన 19వ విడత రోజ్‌గార్ మేళాలో భాగంగా శనివారం సికింద్రాబాద్‌లోని రైల్ కళారంగ్‌లో కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంలోని ఆరు శాఖల్లో ఉద్యోగాలకు ఎంపికైన 218 మంది యువతీయువకులకు మంత్రి నియామక పత్రాలు అందజేశారు. 2022 నుంచి నిర్వహిస్తున్న రోజ్‌గార్ మేళాల ద్వారా లక్షలాది మంది యువతకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు లభించాయని తెలిపారు.

దేశ యువత ఇప్పుడు ఉద్యోగార్థులుగానే కాకుండా ఉద్యోగ సృష్టికర్తలుగా కూడా ఎదుగుతున్నారని ఆయన అన్నారు. అంకుర సంస్థలు, ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం ద్వారా తయారీ రంగంలో పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని వివరించారు.

ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ప్రజాసేవకు అంకితభావంతో పనిచేయాలని, తల్లిదండ్రులను గౌరవిస్తూ వారికి అండగా నిలవాలని మంత్రి సూచించారు.దేశవ్యాప్తంగా జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్‌గా ప్రసంగించారు.కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాత్సవ, ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్ సిద్ధార్థ్ కటి, డీఆర్‌ఎం డాక్టర్ ఆర్‌. గోపాలకృష్ణన్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

యువతకు ఉద్యోగాలతో పాటు సాధికారత రోజ్‌గార్ మేళాతో కేంద్రం భారీ ఉపాధి కల్పన

Article Image

సికింద్రాబాద్‌లో 19వ విడత కార్యక్రమం.

218 మందికి నియామక పత్రాలు అందజేసిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌,: నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలతో పాటు సాధికారత కల్పించడమే ‘రోజ్‌గార్ మేళా’ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి . కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 47 ప్రాంతాల్లో నిర్వహించిన 19వ విడత రోజ్‌గార్ మేళాలో భాగంగా శనివారం సికింద్రాబాద్‌లోని రైల్ కళారంగ్‌లో కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంలోని ఆరు శాఖల్లో ఉద్యోగాలకు ఎంపికైన 218 మంది యువతీయువకులకు మంత్రి నియామక పత్రాలు అందజేశారు. 2022 నుంచి నిర్వహిస్తున్న రోజ్‌గార్ మేళాల ద్వారా లక్షలాది మంది యువతకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు లభించాయని తెలిపారు.

దేశ యువత ఇప్పుడు ఉద్యోగార్థులుగానే కాకుండా ఉద్యోగ సృష్టికర్తలుగా కూడా ఎదుగుతున్నారని ఆయన అన్నారు. అంకుర సంస్థలు, ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం ద్వారా తయారీ రంగంలో పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని వివరించారు.

ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ప్రజాసేవకు అంకితభావంతో పనిచేయాలని, తల్లిదండ్రులను గౌరవిస్తూ వారికి అండగా నిలవాలని మంత్రి సూచించారు.దేశవ్యాప్తంగా జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్‌గా ప్రసంగించారు.కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాత్సవ, ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్ సిద్ధార్థ్ కటి, డీఆర్‌ఎం డాక్టర్ ఆర్‌. గోపాలకృష్ణన్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News