Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధలో ఉన్న కుటుంబాలకు చిరుమర్తి అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:08 PM

యువతకు ఉద్యోగాలతో పాటు సాధికారత రోజ్‌గార్ మేళాతో కేంద్రం భారీ ఉపాధి కల్పన

యువతకు ఉద్యోగాలతో పాటు సాధికారత రోజ్‌గార్ మేళాతో కేంద్రం భారీ ఉపాధి కల్పన

యువతకు ఉద్యోగాలతో పాటు సాధికారత రోజ్‌గార్ మేళాతో కేంద్రం భారీ ఉపాధి కల్పన
May 23, 2026 04:19 PM 17 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సికింద్రాబాద్‌లో 19వ విడత కార్యక్రమం.

218 మందికి నియామక పత్రాలు అందజేసిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌,: నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలతో పాటు సాధికారత కల్పించడమే ‘రోజ్‌గార్ మేళా’ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి . కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 47 ప్రాంతాల్లో నిర్వహించిన 19వ విడత రోజ్‌గార్ మేళాలో భాగంగా శనివారం సికింద్రాబాద్‌లోని రైల్ కళారంగ్‌లో కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంలోని ఆరు శాఖల్లో ఉద్యోగాలకు ఎంపికైన 218 మంది యువతీయువకులకు మంత్రి నియామక పత్రాలు అందజేశారు. 2022 నుంచి నిర్వహిస్తున్న రోజ్‌గార్ మేళాల ద్వారా లక్షలాది మంది యువతకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు లభించాయని తెలిపారు.

దేశ యువత ఇప్పుడు ఉద్యోగార్థులుగానే కాకుండా ఉద్యోగ సృష్టికర్తలుగా కూడా ఎదుగుతున్నారని ఆయన అన్నారు. అంకుర సంస్థలు, ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం ద్వారా తయారీ రంగంలో పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని వివరించారు.

ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ప్రజాసేవకు అంకితభావంతో పనిచేయాలని, తల్లిదండ్రులను గౌరవిస్తూ వారికి అండగా నిలవాలని మంత్రి సూచించారు.దేశవ్యాప్తంగా జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్‌గా ప్రసంగించారు.కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాత్సవ, ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్ సిద్ధార్థ్ కటి, డీఆర్‌ఎం డాక్టర్ ఆర్‌. గోపాలకృష్ణన్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News