యువతకు క్రీడలే లక్ష్యంగా యువ సర్పంచ్ ముందడుగు.సాయికుమార్ గౌడ్
యువతకు క్రీడలే లక్ష్యంగా యువ సర్పంచ్ ముందడుగు.సాయికుమార్ గౌడ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం గ్రామంలో యువతను క్రీడల వైపు మళ్లించే దిశగా గ్రామ సర్పంచ్ కునూరు సాయికుమార్ గౌడ్ ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని యువత, మహిళలకు ఉత్సాహాన్ని నింపేలా పలు క్రీడా పోటీలు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.మహిళల కోసం సంక్రాంతి ముగ్గుల పోటీలు, యువత కోసం క్రికెట్ టోర్నమెంట్ను పూర్తిగా తన సొంత నిధులతో ఏర్పాటు చేయడం విశేషం. అంతేకాక గ్రామ యువతకు క్రీడలకు అనువుగా గ్రౌండ్ను శుభ్రపరచి అవసరమైన ఏర్పాట్లు చేయించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, యువత చదువుతో పాటు క్రీడల్లోనూ నైపుణ్యం సాధించాలని, శారీరక దృఢత్వం, క్రమశిక్షణతోనే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోగలమని అన్నారు. గ్రామ యువత ఇతరులకు ఆదర్శంగా నిలవాలనే లక్ష్యంతోనే ఈ కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు.గ్రామాభివృద్ధితో పాటు యువత శక్తిని సానుకూల దిశగా మళ్లించే ఇలాంటి ప్రయత్నాలు ప్రశంసనీయం అంటూ గ్రామస్తులు అభినందనలు తెలిపారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి