యువత క్రీడా నైపుణ్యాల అభివృద్ధికి సర్పంచ్ కూనూరి సాయికుమార్ గౌడ్ చేయూత
యువత క్రీడా నైపుణ్యాల అభివృద్ధికి సర్పంచ్ కూనూరి సాయికుమార్ గౌడ్ చేయూత
Editor Desk
క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతుల ప్రదానం
రామన్నపేట (స్థానికం ప్రధాన ప్రతినిధి):
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని భోగారం గ్రామంలో సంక్రాంతి సంబరాలను పురస్కరించుకుని నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్లో గెలుపొందిన విజేతలకు గ్రామ సర్పంచ్ కూనూరి సాయికుమార్ గౌడ్ బహుమతులు అందజేశారు.గ్రామ యువతలో క్రీడా నైపుణ్యాలు పెంపొందించాలనే లక్ష్యంతో తనవంతుగా కృషి చేస్తున్న యువ సర్పంచ్ కూనూరి సాయికుమార్ గౌడ్, ఈ టోర్నమెంట్ను తన సొంత నిధులతో నిర్వహించి యువకులకు క్రీడలపై ఆసక్తి పెరిగేలా ప్రోత్సహించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన ఈ పోటీల్లో విజయం సాధించిన జట్లకు బహుమతులు అందజేస్తూ యువతను అభినందించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, క్రీడలు యువతను శారీరకంగా, మానసికంగా దృఢంగా తీర్చిదిద్దుతాయని, గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభావంతులు వెలువడేలా అందరూ కృషి చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి