Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:08 AM

యువత క్రీడా నైపుణ్యాల అభివృద్ధికి సర్పంచ్ కూనూరి సాయికుమార్ గౌడ్ చేయూత

యువత క్రీడా నైపుణ్యాల అభివృద్ధికి సర్పంచ్ కూనూరి సాయికుమార్ గౌడ్ చేయూత

యువత క్రీడా నైపుణ్యాల అభివృద్ధికి సర్పంచ్ కూనూరి సాయికుమార్ గౌడ్ చేయూత
14-01-2026 176 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతుల ప్రదానం

రామన్నపేట (స్థానికం ప్రధాన ప్రతినిధి):

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని భోగారం గ్రామంలో సంక్రాంతి సంబరాలను పురస్కరించుకుని నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్‌లో గెలుపొందిన విజేతలకు గ్రామ సర్పంచ్ కూనూరి సాయికుమార్ గౌడ్ బహుమతులు అందజేశారు.గ్రామ యువతలో క్రీడా నైపుణ్యాలు పెంపొందించాలనే లక్ష్యంతో తనవంతుగా కృషి చేస్తున్న యువ సర్పంచ్ కూనూరి సాయికుమార్ గౌడ్, ఈ టోర్నమెంట్‌ను తన సొంత నిధులతో నిర్వహించి యువకులకు క్రీడలపై ఆసక్తి పెరిగేలా ప్రోత్సహించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన ఈ పోటీల్లో విజయం సాధించిన జట్లకు బహుమతులు అందజేస్తూ యువతను అభినందించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, క్రీడలు యువతను శారీరకంగా, మానసికంగా దృఢంగా తీర్చిదిద్దుతాయని, గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభావంతులు వెలువడేలా అందరూ కృషి చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

యువత క్రీడా నైపుణ్యాల అభివృద్ధికి సర్పంచ్ కూనూరి సాయికుమార్ గౌడ్ చేయూత

Article Image

క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతుల ప్రదానం

రామన్నపేట (స్థానికం ప్రధాన ప్రతినిధి):

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని భోగారం గ్రామంలో సంక్రాంతి సంబరాలను పురస్కరించుకుని నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్‌లో గెలుపొందిన విజేతలకు గ్రామ సర్పంచ్ కూనూరి సాయికుమార్ గౌడ్ బహుమతులు అందజేశారు.గ్రామ యువతలో క్రీడా నైపుణ్యాలు పెంపొందించాలనే లక్ష్యంతో తనవంతుగా కృషి చేస్తున్న యువ సర్పంచ్ కూనూరి సాయికుమార్ గౌడ్, ఈ టోర్నమెంట్‌ను తన సొంత నిధులతో నిర్వహించి యువకులకు క్రీడలపై ఆసక్తి పెరిగేలా ప్రోత్సహించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన ఈ పోటీల్లో విజయం సాధించిన జట్లకు బహుమతులు అందజేస్తూ యువతను అభినందించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, క్రీడలు యువతను శారీరకంగా, మానసికంగా దృఢంగా తీర్చిదిద్దుతాయని, గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభావంతులు వెలువడేలా అందరూ కృషి చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News